+91 95819 05907

రాజయ్య నగర్ గ్రామంలోని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలనీ ఏర్పాటు చేయాలి.

చర్ల నేటి గదర్ ప్రతినిధి :వరప్రసాద్

గిరిజన విద్యార్థులకు విద్యను అందించడంలో అధికారులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి నశించాలి

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్

చర్ల మండలం సుబ్బంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రాజయ్య నగర్ గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ చైర్మన్ కేపి జోస్, జోమోల్ వారి సహకారంతో గ్రామంలో ఉన్న 25 మంది విద్యార్థుల చదువులకు అవసరమైన బ్యాగులు పెన్నులు పుస్తకాలు బోర్డు మరియు తాత్కాలిక ఉపాధ్యాయురాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్టికల్ 21/ఎ ఉచిత నిర్బంధ విద్య 2009 చట్టం ప్రకారం భారతదేశ ప్రజలందరికీ ముఖ్యంగా ఆరు నుండి 14 సంవత్సరాల బాల బాలికలకు ఉచితంగా విద్యను అందించాలని భారత రాజ్యాంగ చట్టం చెబుతున్నప్పటికీ నేటికీ కొన్ని గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వ విద్య అందడం లేదని అందులో భాగంగా చర్ల మండలంలోని సుబ్బంపేట పంచాయతీలోని రాజనగర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేదని తక్షణమే ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ని ఏర్పాటు చేయాలని ఆ గ్రామంలో ఉన్న విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్ అన్నారు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చదువుకు దూరం అవుతున్న రాజయ్య నగర్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకొని ఐపీఎఫ్ ఇంటర్నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ వారు విద్యార్థులు చదువులకు అవసరమైన పెన్నులు పుస్తకాలు మరియు ఉపాధ్యాయురాలని నియమించడం సంతోషకరమైన విషయం అని అన్నారు ఈ రకమైన కృషిచేసిన ఐపిఎఫ్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేశారు స్వచ్ఛంద సంస్థలు స్పందిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదు అని అన్నారు ప్రభుత్వలా నిర్లక్ష్యం కారణంగా ఉచిత నిర్బంధ హక్కు చట్టం అపహస్యం అవుతుంది భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం ఆదివాసి ప్రాంతాల్లో ఉచిత నిర్బంధ విద్య ఏర్పాటు చేయవలసి ఉండగా ప్రభుత్వాలు ఆ పనిని విస్మరించి ఆదివాసి బాలబాలికలకు విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు తెలియజేసినప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం దుర్మార్గం అని అన్నారు ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి గిరిజన బిడ్డలకు నాణ్యమైన నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కొండ చరణ్, పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చల్లగుండ్ల సతీష్ చౌదరి పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండ కౌశిక్ పార్టీ చర్ల మండల ఉపాధ్యక్షులు చెన్న0 మోహన్ మరియు ఐపీఎఫ్ సంస్థ నాయకులు వి దానియేలు, హనూక్, జి జాన్ పాల్, ఏ బెన్నీ మరియు గ్రామస్తులు రేగ ఆంధ్రయ , బాయమ్మ , జములు, జోగయ్య, సురేంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

హొలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ సూచన ఇదే

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి

Read More »

రక్త దాన శిబిరం విజయవంతం

*శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు మెగా సర్వీస్ క్యాంప్ తో పాటు భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో రక్త దాన శిబిరం విజయవంతం* భద్రాద్రి కొత్తగూడెం

Read More »

ఆత్కూరు నుండి మధిర, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గదర్ న్యూస్, మార్చి 12 మధిర నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు

Read More »

 Don't Miss this News !