★ములుగు జిల్లాలో సిడిపిఓ ధనలక్ష్మి ఆత్మహత్యయత్నం
నేటి గదర్ న్యూస్,ములుగు ప్రతినిధి:
ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో సిడిపిఓగా విధులు నిర్వహి స్తున్న ధనలక్ష్మి కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకుంది.
అంగన్వాడి టీచర్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుం దని, కావాలని అంగన్వాడి టీచర్లు తనపై జిల్లాకలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు తనను సస్పెండ్ చేశారని, మనస్థాపానికి గురై ఆత్మహత్య ప్రయ త్నం చేసుకున్నట్టు తెలుస్తుంది.ఆమెను హుటా హుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు.సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియవలసి ఉంది.
Post Views: 963









