+91 95819 05907

వైరా మండలం లో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలి

రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆదేశించిన కొనుగోలు లేదు
రైతులు నిరసన

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

వైరా :- వైరా మండలం లో విప్పలమడక, సిరిపురం గ్రామాలలో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు.
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని మంత్రులు ప్రకటించిన అధికారులు కొనుగోలు చేయడం లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. మంగళవారం వైరా మండలం విప్పల మడక గ్రామం లో ధాన్యం రాశులు వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాసులు జనవరి 31 వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది చివరి తేదీ గడువు కంటే నాలుగు రోజుల ముందుగానే కొనుగోలు నిలుపుదల చేశారు అని అన్నారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు అలస్యం కావడం వల్ల వరి కోతలు జనవరి రెండవ వారం లోకూడా జరిగాయి అని అన్నారు. మిగిలిన ధాన్యం కొనుగోలు సమస్య పై జిల్లా కలెక్టర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ దృష్టి కి రైతులు తీసుకువచ్చారు అని ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులను రెవెన్యూ మంత్రి అందేశించిన ధాన్యం కొనుగోలు జరగడం లేదని అన్నారు ,మరో వారం రోజులు ధాన్యం కొనుగోలు గడువు ఇచ్చినట్లయితే కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుంది అన్నారు, ఈ కార్యక్రమంలో విప్పలమడక మాజీ సర్పంచ్లు పారుపల్లి కృష్ణారావు, తుమ్మల జాన్ పాపయ్య, రైతు సంఘం మండల అధ్యక్షులు మేడా శరబంధి, ఎస్ కె జానిమీయా, నీటి సంఘం మాజీ అధ్యక్షులు కొల్లా వెంకటేశ్వరరావు, రుద్రాక్షల వెంకటయ్య, దెవభక్తిని అర్జున్ రావు, భద్రయ్య, మురళి, సాంబశివరావు, రామారావు, పుల్లారావు, రైతులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కులగణన సర్వేను ప్రజలు విజయవంతం చేయాలి పల్లె రామచంద్రం గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ ఆయన స్వగృహంలో స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర

Read More »

ఆదివాసి యువత విద్య ,క్రీడల పై మక్కువ పెంచుకోవాలి :గుండాల సీఐ ఎల్ రవీందర్

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని ఆదివాసి యువత విద్య క్రీడలపై మక్కువ పెంచుకొని రానించాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని అడవిరామారం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్

Read More »

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది

Read More »

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి… 17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల

Read More »

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ చిరుమల్ల కి రాక.

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ నిర్మల్ జిల్లా మామిడి మండలానికి చెందిన రచ్చ కోట పంద్రం జాలిష్ మహారాజ్ స్వామీజీ, దేవనగరం సమ్మక్క గద్దెల పూజారి తోలెం నాగయ్య

Read More »

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు

Read More »

 Don't Miss this News !