+91 95819 05907

వైరా మండలం లో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలి

రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆదేశించిన కొనుగోలు లేదు
రైతులు నిరసన

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

వైరా :- వైరా మండలం లో విప్పలమడక, సిరిపురం గ్రామాలలో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు.
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని మంత్రులు ప్రకటించిన అధికారులు కొనుగోలు చేయడం లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. మంగళవారం వైరా మండలం విప్పల మడక గ్రామం లో ధాన్యం రాశులు వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాసులు జనవరి 31 వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది చివరి తేదీ గడువు కంటే నాలుగు రోజుల ముందుగానే కొనుగోలు నిలుపుదల చేశారు అని అన్నారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు అలస్యం కావడం వల్ల వరి కోతలు జనవరి రెండవ వారం లోకూడా జరిగాయి అని అన్నారు. మిగిలిన ధాన్యం కొనుగోలు సమస్య పై జిల్లా కలెక్టర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ దృష్టి కి రైతులు తీసుకువచ్చారు అని ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులను రెవెన్యూ మంత్రి అందేశించిన ధాన్యం కొనుగోలు జరగడం లేదని అన్నారు ,మరో వారం రోజులు ధాన్యం కొనుగోలు గడువు ఇచ్చినట్లయితే కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుంది అన్నారు, ఈ కార్యక్రమంలో విప్పలమడక మాజీ సర్పంచ్లు పారుపల్లి కృష్ణారావు, తుమ్మల జాన్ పాపయ్య, రైతు సంఘం మండల అధ్యక్షులు మేడా శరబంధి, ఎస్ కె జానిమీయా, నీటి సంఘం మాజీ అధ్యక్షులు కొల్లా వెంకటేశ్వరరావు, రుద్రాక్షల వెంకటయ్య, దెవభక్తిని అర్జున్ రావు, భద్రయ్య, మురళి, సాంబశివరావు, రామారావు, పుల్లారావు, రైతులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !