★కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.
★బడ్జెట్ ను సవరించి తెలంగాణకు అన్ని రంగాలకు నిధులు కేటాయించాలి
★ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగు మహాధర్నా జయప్రదం చేయండి.
భూక్యా వీరభద్రం, మెరుగు సత్యనారాయణ.
నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి
వైరా :కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని, తెలంగాణకు మొండి చేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ బడ్జెట్ సవరించి తెలంగాణకు తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా వేలాది మందితో జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ కోరారు. మంగళవారం వైరా బోడెపుడి భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం వైరా మండలం కార్యదర్శి తూము సుధాకర్ అధ్యక్షతన జరిగిన ప్రజాసంఘాల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు బడ్జెట్లో నిధులు కోత విధించి పేదలకు పనులు దొరకకుండా చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పరిశ్రమలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు. విద్యా, వైద్యం ఉపాధిని పూర్తిగా విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగు మహాధర్నాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం వైరా పట్టణ కార్యదర్శి గుమ్మ నరసింహారావు, షేక్ రెహానా బి, షేక్ మజీద్ బి, యనమద్ది రామకృష్ణ, ఓర్పు సీతారాములు, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.