+91 95819 05907

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న చలో హైదరాబాద్

★కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.

★బడ్జెట్ ను సవరించి తెలంగాణకు అన్ని రంగాలకు నిధులు కేటాయించాలి

★ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగు మహాధర్నా జయప్రదం చేయండి.

భూక్యా వీరభద్రం, మెరుగు సత్యనారాయణ.

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

వైరా :కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని, తెలంగాణకు మొండి చేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ బడ్జెట్ సవరించి తెలంగాణకు తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా వేలాది మందితో జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ కోరారు. మంగళవారం వైరా బోడెపుడి భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం వైరా మండలం కార్యదర్శి తూము సుధాకర్ అధ్యక్షతన జరిగిన ప్రజాసంఘాల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు బడ్జెట్లో నిధులు కోత విధించి పేదలకు పనులు దొరకకుండా చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పరిశ్రమలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు. విద్యా, వైద్యం ఉపాధిని పూర్తిగా విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగు మహాధర్నాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం వైరా పట్టణ కార్యదర్శి గుమ్మ నరసింహారావు, షేక్ రెహానా బి, షేక్ మజీద్ బి, యనమద్ది రామకృష్ణ, ఓర్పు సీతారాములు, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !