+91 95819 05907

మతిస్థిమితం లేని మహిళను బంధువులకు అప్పగించిన ఆర్కే ఫౌండేషన్

నేటి గదర్ న్యూస్ జనవరి 05, ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891

చనిపోయిందని అనుకున్నారు .
తిరిగి ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యపోయారు.

తిరుపతిలో తప్పిపోయిన మతిస్థిమితం లేని మహిళ.
మధిరలో ప్రత్యక్షం.

మిస్సింగ్ కేసు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసులు జారీచేసిన తిరుపతి అలిపిరి పోలీసులు.

వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకుడు దోర్నాల రామకృష్ణ

మధిర టౌన్ పోలీసులకు ఆర్కే ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన బంధువులు.

కొన్ని రోజుల క్రితం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద అనుమానాస్పదంగా ఒక మహిళ సంచరిస్తూ ఉండడంతో పెట్రోల్ బంకు సిబ్బంది మధిర టౌన్ పోలీసులకు తెలియజేశారు. వెంటనే నైట్ పెట్రోలింగ్ బ్లూ కోట్ కానిస్టేబుల్ బాణావత్ కొండ సదరు మహిళ వద్దకు వెళ్లి వివరాలు అడగగా ఏమి చెప్పలేని పరిస్థితులలో ఉన్న మహిళకు మతిస్థిమితం లేదని గ్రహించి ఆర్కే ఫౌండేషన్ వారికి తెలియజేసి అనాధ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు.
ఆశ్రమం నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి మహిళకు కొన్ని రోజులు సపరియలు చేసి మహిళ వివరాలు అడుగగా ఖమ్మం వద్ద అని చెప్పటంతో ఆ దిశగా సోషల్ మీడియా ద్వారా బంధువుల ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు. కానీ సదరు మహిళది ప్రకాశం జిల్లా ఖంబం దగ్గర కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించి సోషల్ మీడియాకు తెలియజేశారు. వెంటనే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను చూసిన కుమారుడు కుమార్తెలు తమ తల్లి బ్రతికే ఉందని ఆనంద భాష్పాలతో వెంటనే అక్కడి పోలీసు వారి సహకారంతో మధిర పట్టణంలో ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మెగావత్ రూప్లే భాయ్ 60 మావుటూరు తండా ,అర్ధవీడు (మండలం) ప్రకాశం (జిల్లా) అని తిరుపతిలో కుమార్తె వద్దకు వచ్చే సమయంలో భర్త తులసి నాయక్ వద్ద నుండి తప్పిపోయినదని ఆధారాలతో తెలియజేసి.. మధిర పట్టణ టౌన్ ఎస్సై సంధ్య పర్యవేక్షణలో కానిస్టేబుల్ తమ్మిశెట్టి శ్రీనివాసరాజు సమక్షంలో రూప్లే భాయ్ ని మనవడు వంశీ నాయక్ కు అప్పగించారు. ఎంతోమందిమతిస్థిమితం కోల్పోయిన వృద్ధులను మహిళను బంధువులకు అప్పగిస్తూ.. ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న మధిర టౌన్ పోలీసులను మరియు ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !