+91 95819 05907

మతిస్థిమితం లేని మహిళను బంధువులకు అప్పగించిన ఆర్కే ఫౌండేషన్

నేటి గదర్ న్యూస్ జనవరి 05, ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891

చనిపోయిందని అనుకున్నారు .
తిరిగి ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యపోయారు.

తిరుపతిలో తప్పిపోయిన మతిస్థిమితం లేని మహిళ.
మధిరలో ప్రత్యక్షం.

మిస్సింగ్ కేసు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసులు జారీచేసిన తిరుపతి అలిపిరి పోలీసులు.

వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకుడు దోర్నాల రామకృష్ణ

మధిర టౌన్ పోలీసులకు ఆర్కే ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన బంధువులు.

కొన్ని రోజుల క్రితం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద అనుమానాస్పదంగా ఒక మహిళ సంచరిస్తూ ఉండడంతో పెట్రోల్ బంకు సిబ్బంది మధిర టౌన్ పోలీసులకు తెలియజేశారు. వెంటనే నైట్ పెట్రోలింగ్ బ్లూ కోట్ కానిస్టేబుల్ బాణావత్ కొండ సదరు మహిళ వద్దకు వెళ్లి వివరాలు అడగగా ఏమి చెప్పలేని పరిస్థితులలో ఉన్న మహిళకు మతిస్థిమితం లేదని గ్రహించి ఆర్కే ఫౌండేషన్ వారికి తెలియజేసి అనాధ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు.
ఆశ్రమం నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి మహిళకు కొన్ని రోజులు సపరియలు చేసి మహిళ వివరాలు అడుగగా ఖమ్మం వద్ద అని చెప్పటంతో ఆ దిశగా సోషల్ మీడియా ద్వారా బంధువుల ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు. కానీ సదరు మహిళది ప్రకాశం జిల్లా ఖంబం దగ్గర కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించి సోషల్ మీడియాకు తెలియజేశారు. వెంటనే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను చూసిన కుమారుడు కుమార్తెలు తమ తల్లి బ్రతికే ఉందని ఆనంద భాష్పాలతో వెంటనే అక్కడి పోలీసు వారి సహకారంతో మధిర పట్టణంలో ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మెగావత్ రూప్లే భాయ్ 60 మావుటూరు తండా ,అర్ధవీడు (మండలం) ప్రకాశం (జిల్లా) అని తిరుపతిలో కుమార్తె వద్దకు వచ్చే సమయంలో భర్త తులసి నాయక్ వద్ద నుండి తప్పిపోయినదని ఆధారాలతో తెలియజేసి.. మధిర పట్టణ టౌన్ ఎస్సై సంధ్య పర్యవేక్షణలో కానిస్టేబుల్ తమ్మిశెట్టి శ్రీనివాసరాజు సమక్షంలో రూప్లే భాయ్ ని మనవడు వంశీ నాయక్ కు అప్పగించారు. ఎంతోమందిమతిస్థిమితం కోల్పోయిన వృద్ధులను మహిళను బంధువులకు అప్పగిస్తూ.. ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న మధిర టౌన్ పోలీసులను మరియు ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రుణమాఫీ చేసినందుకు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, రైతులు

నేటి గదర్ న్యూస్, మార్చి 13, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891 ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు ప్రజా ప్రభుత్వం ముఖ్యమం ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన

Read More »

గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించిన దేశినేనిపాలెం గ్రామవాసి

*శుభాకాంక్షలు తెలియజేసిన దేశనేనిపాలెం గ్రామ ప్రజలు…* 💐💐💐 గ్రూప్ -2 విజయం సాధించిన దేశీనేనిపాలెం గ్రామవాసి నేటి గదర్ న్యూస్, మార్చి 13, సగ్గుర్తి ముత్యాల రావు మధిర మండలం దేశినేనిపాలెం గ్రామానికి చెందిన

Read More »

3వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ నేటి గదర్ న్యూస్, మార్చి 13. మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత

Read More »

ఆ వలస ఆదివాసి గ్రామంలో టీవీ యాంకర్లు సందడి చేశారు.మన గ్రోమోర్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం

నేటి గదర్ న్యూస్,పినపాక: మండలంలోని గ్రామపంచాయతీ లోని తిల్లాపురం ఆదివాసి గ్రామంలో బిగ్ ఫేమస్ ఆర్టిస్టులు గీత రాయల్ శ్రీ సత్య పవిత్ర యాంకర్ అనిల్ జిలా గురువారం పర్యటించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో

Read More »

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

 Don't Miss this News !