+91 95819 05907

గురువు కానిస్టేబుల్.. శిష్యురాలు ఎస్సై.. ఒకే స్టేషన్లో కొలువులు

ఈ చిత్రంలో ఎస్సైగా యూనిఫాంలో ఉన్న యువతి పేరు జబీనాబేగం. పక్కన నిలబడింది అదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లాల్యానాయక్. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? వీళ్లిద్దరూ గురుశిష్యులు కావడం, ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థిని ఎస్సైగా.. తాను కానిస్టేబుల్ గా పనిచేసే స్టేషన్ కి రావడం ఇందులో ప్రత్యేకత. ఇద్దరూ పేదరికం అనే అడ్డంకులను దాటుకుని ఆయా స్థానాలకు చేరుకోవడం మరింత ప్రత్యేకం.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాల్యానాయక్ నిరుపేద కుటుంబం. తండ్రి నాలుగో తరగతిలో పరిగిలోని ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించడంతో అక్కడే ఉంటూ ఇంటర్ పూర్తిచేశారు. తర్వాత పాల్వంచలో డిగ్రీ పూర్తిచేసిన ఆయన..ఎంఏ, బీఎడ్ పూర్తిచేసి పరిగిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా చేరారు. కొవిడ్ సమయంలో కళాశాల మూతపడటంతో ఉపాధి కోల్పోయారు. పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమై..2020లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.

లాల్యానాయక్ లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో నిరుపేద కుటుంబ నేపథ్యం ఉన్న అదే జిల్లాలోని మక్తా వెంకటాపూర్ గ్రామానికి చెందిన జబీనాబేగం ఇంటర్ లో చేరారు. చదువులో చురుగ్గా ఉండటంతో లాల్యానాయక్ ఆమెను ప్రోత్సహించారు. ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకుని.. వారితో మాట్లాడి రద్దు చేయించారు. ఇంటర్ తోపాటు డిగ్రీ చదివేవరకు అండగా నిలిచారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకూ చేదోడుగా ఉన్నారు. గురువు ప్రోత్సాహానికి స్వయం కృషిని జోడించిన జబీనాబేగం 2024లో ఎస్సై పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని ఎస్సైగా (ప్రొబేషన్) మొయినాబాద్ పోలీసుస్టేషన్ లో పోస్టింగ్ పొందారు. తన శిష్యురాలు బుధవారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్నట్టు తెలుసుకున్న లాల్యానాయక్..జబీనాబేగంకు ప్రధాన ద్వారం వద్ద సెల్యూట్ చేసి స్వాగతం పలికారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !