+91 95819 05907

ఓటు హక్కు – ప్రజాస్వామిక హక్కు :తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్పర్సన్ జీవి వెన్నెల

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు.

ఓటు హక్కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రసాదించిన ఆయుధం. ఓటుతో నీ విలువ పెంచుకోవచ్చును. పైసలకు, కులానికి, మత్తుకు, ఓటును బలిచేయవద్దని చైర్మన్ తెలంగాణ సాంస్కృతిక సారథి జీవి వెన్నెల అన్నారు. గురువారం ఖమ్మం వైరా రోడ్డు వేదిక కన్వెన్షన్ హాల్లో రచయిత కవి గాయకులు యశ్ పాల్ అధ్యక్షతన ఎమ్మెల్సీ ఓటు విలువ దాని ప్రాధాన్యత అనే అంశంపై సదస్సు జరిగినది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జీవి వెన్నెల మాట్లాడుతూ విద్యావంతులకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

చదువురాని పామరులు ఓటును చక్కగా వినియోగించుకుంటారని విద్యావంతులే కొంత జాప్టన్ చేస్తూ పాల్గొటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. విద్యావంతులు ఇతరులకు ఆదర్శవంతులుగా ముందు ఉండాలని విజ్ఞప్తి చేశారు. సారధి కళాకారులకు ఓటు హక్కు పై ప్రచారం చేయమని ఆదేశించారు.సారధి కళాకారులు, రచయిత యశ్ పాలు మాట్లాడుతూ ఖమ్మం భద్రాచలం జిల్లాలో ప్రచారం చేస్తున్నారని గ్రాడ్యుయేట్ ఓటర్లు తప్పకుండా ఓటు హాల్ వరకు వచ్చేలా చూడాలని అందుకు ఆటపాట ద్వారా ప్రచారం విచిత్రంగా చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కవి రచయిత దేవేంద్ర, సుబ్రమణ్య కుమార్ ( ఖమ్మం కళా సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ), జీవన్( విరసం ఆవిర్భావ సభ్యులు), ఖమ్మం కళాపరిషత్ నాగబత్తిని రవి, సాంస్కృతిక సేన చక్రాల రఘు, కానుగుల రాధాకృష్ణ. జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు పోలూరు రాము, పుల్లారావు, సారధి కళాకారులు మిమిక్రీ సుధాకర్, కాల్వకట్ల జాన్, పాగి వెంకన్న, బొమ్మెర ముత్యం, నకిరికంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆ వలస ఆదివాసి గ్రామంలో టీవీ యాంకర్లు సందడి చేశారు.మన గ్రోమోర్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం

నేటి గదర్ న్యూస్,పినపాక: మండలంలోని గ్రామపంచాయతీ లోని తిల్లాపురం ఆదివాసి గ్రామంలో బిగ్ ఫేమస్ ఆర్టిస్టులు గీత రాయల్ శ్రీ సత్య పవిత్ర యాంకర్ అనిల్ జిలా గురువారం పర్యటించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో

Read More »

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

 Don't Miss this News !