+91 95819 05907

నిధులుమంజూరు అంటూ ప్రచారం…. ఖమ్మం రైల్వే కాలనీలో అభివృద్ధి ఎక్కడ?

రైల్వే కాలనీలో అధ్వానంగా రోడ్లు

ఖమ్మం నగరంలో పేరుకు నెంబర్ వన్ కార్పొరేషన్…అభివృద్ధిలో మాత్రం శూన్యం..కైకొండాయిగూడెం ఒకటో డివిజన్ రైల్వే కాలనీలో అధ్వానంగా రోడ్లు..నిధులుమంజూర్ అంటూ ప్రచారం…పనులు ప్రారంభించని పరిస్థితి..రోడ్లు అధ్వానంతో పాటు…సైడ్ డ్రైన్లు లేక మురుగు నీటిలో దోమల బెడద..తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రజా ప్రతినిధులకు కాలనీవాసులు విజ్ఞప్తి.

ఖమ్మం మహానగరంలోని పేరుకు నెంబర్ వన్ కార్పొరేషన్ గా ఉన్న కైకొండాయిగూడెం ఒకటో డివిజన్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా నెలకొన్నది.పేరుకు నెంబర్ వన్ కార్పొరేషన్ తప్ప అభివృద్ధిలో మాత్రం శూన్యం అని ఆ ప్రాంతవాసులు తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.కైకొండాయిగూడెం ఒకటో డివిజన్లోని ప్రధానంగా రైల్వే కాలనీలో అనేక రోడ్లు నిర్మాణం లేక అద్వానంగా రోడ్లు ఉండటంతో పాటు సైడ్ డ్రయిన్లు లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ప్రధానంగా గుంతలుగుంతలుగా ఉన్న రోడ్లతోపాటు సైడ్ ట్రైన్లో లేక మురుగునీరు చేరి ఇండ్లలో నుంచి వచ్చినటువంటి వ్యర్థపు నీరు బయటికి రావటంతో సైడ్ నిర్మాణాలు చేపట్టగా ఒకే చోట నీటి గుంట గా ఏర్పడి దుర్గంధం వెదజల్లడంతో దోమలు వ్యాపించి ప్రజలు తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ నేటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో ప్రజల్లో తీవ్రమైనటువంటి విమర్శలు ఎదురవుతున్నాయి.అన్నీ ఉన్న అల్లుడు నోట్లో..చని అన్న చందాగా..పరిస్థితి నెలకొన్నదని రైల్వే కాలనీవాసులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికార పార్టీ అయినప్పటికీ ఈ ప్రాంతం పాలేరు నియోజకవర్గంలో భాగం కావడంతో రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిద్దాం వహించటంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు తమ గెలుపులో కీలక పాత్ర పోషించారు.అయినప్పటికీ ఈ ప్రాంతం ఖమ్మం కార్పొరేషన్ లోనే నెంబర్ వన్ ఒకటో డివిజన్ కావటం అభివృద్ధిలో మాత్రం కొన్ని ఏరియాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో ప్రధానంగా రైల్వే కాలనీలోని,1,2,3,4,తదితర రోడ్లు గోతులు ఉండటంతోపాటు సైడ్ ట్రైన్లో లేక ఆ ప్రాంతంలో నివసిస్తున్న అటువంటి ప్రజలు రాత్రి సమయంలో ఆరు బయటకు రావాలంటేనే తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చెత్తాచెదారం పారిశుద్ధ చర్యలు సరిగా చేపట్టక ఈ ప్రాంత అభివృద్ధి పై సరిగా అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ నాయకులు కానీ దృష్టి సారించక మారుమూల ప్రాంతాలను తలపించే విధంగా అభివృద్ధికి ఆమేడ దూరంలో ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.కార్పొరేషన్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే జరగనుండటంతో రానున్న కాలంలో పోటీ చేసే అభ్యర్థులకు ఈ ప్రాంత ప్రజల నుండి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇంటి పన్ను వాటర్ పన్ను అనేకమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని పన్నులు వసూలు చేసి విద్యుత్తు బిల్లులు విపరీతంగా వసూలు చేస్తూ ప్రభుత్వ పరంగా అన్ని రకాల పన్నులు విధిస్తూ ఈ ప్రాంతం నుండి భారీ స్థాయిలో నిధులు సేకరిస్తున్నటువంటి అధికారులు ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం సరైనది కాదని ఈ ప్రాంత ప్రజలు వారు తీరు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పక్క కార్పొరేషన్ పరిధిలోని వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నప్పటికీ కేవలం కైకొండాయిగూడెం ఒకటో డివిజన్లోని రైల్వే కాలనీ పరిస్థితి అద్వానంగా ఉండటం లక్షలాది రూపాయల వేచించి ఇండ్లను కొనుగోలు చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర ఆవేదనను కలిగిస్తుందని వారు తెలియజేస్తున్నారు.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాంత నాయకులు దృష్టి సారించి ఈ ప్రాంతా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలి :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

◆మార్చి 15లోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చెయ్యాలి ◆ప్రతి రైతు వ్యవసాయ భూమిలో ఫారం పాండ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ◆రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో

Read More »

జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి :సీఎం రేవంత్ రెడ్డి

*తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.* హైదరాబాద్ రవీంధ్రభారతిలో *కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

 Don't Miss this News !