+91 95819 05907

మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షుని రేసులో నాగేందర్ రెడ్డి

అవకాశం ఇస్తే కొత్తతరాన్ని ముందుకు తీసుకొస్తానంటున్న నాగేందర్ రెడ్డి.

మాసాయిపేట మండలం నేటి గద్దర్ (భూపాల్) మార్చ్ 2.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి మండల కమిటీలు పూర్తికాగా మెదక్ జిల్లాలో అందుకు భిన్నంగా కొన్ని మండలాల్లో ఇప్పటివరకు కొత్తగా బిజెపి మండల నాయకులను ఎన్నుకోవడంలో అలసత్వం వహిస్తున్న మెదక్ జిల్లా బిజెపి నాయకత్వం. పూర్తి వివరాల్లోకి వెళితే ,మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎంపీ కార్యాలయం ఉండడం బిజెపి నాయకులకు ఒక గట్టి పునాది. కానీ మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి నాయకులు కార్యకర్తలలో విభేదాల కారణంగా ఇప్పటివరకు మండల కమిటీ వేయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షుని ఒంటెద్దు పోకడల కారణంగా బిజెపి కార్యకర్తలు సహకరించకపోవడంతో ఇప్పటివరకు మండల కమిటీ పూర్తి కాలేదని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉండాలని ఓవైపు బిజెపి అధినాయకత్వం నూతన కమిటీలు వేస్తూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సాహిస్తూ, ముందుకు తీసుకొస్తుంటే, మెదక్ జిల్లాలో మాత్రం కొన్ని మండలాల్లో ఇప్పటివరకు పాత నాయకులనే ఉంచడానికి గల కారణం ఏమిటో అర్థం కావడం లేదని, బిజెపి నాయకత్వానికి ప్రతి మండలంలో కొత్త నాయకుల ఎన్నిక ఎంతైన అవసరం ఉందని, కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం ఉన్న పాత నాయకులతో సరిపెట్టుకుందాం అంటే పాత నాయకులతో కలిసి రావడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరని పలుమార్లు జరిగిన మీటింగ్లలో చూసిన విధానమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం మండలంలో ఐదు నుంచి పది మంది వరకే మండల కమిటీకి వస్తున్నారని, అది కూడా ఒకటి రెండు ఊర్ల నుండి మాత్రమే బిజెపి కార్యకర్తలు రావడం ఎంత వరకు సమంజసమని, మిగిలిన గ్రామాల్లో నాయకత్వం బిజెపి పై సదభిప్రాయం ఉన్న మాసాయిపేట మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఇప్పటివరకు నూతనంగా గ్రామ కమిటీలు లేకపోవడం ఎవరి నిర్లక్ష్యమో అంతుపట్టడం లేదని ఊహాగానాలు.అందుకే బిజెపి నూతన మండల కమిటీని వేయడానికి ఎవరు కూడా సహకరిస్తున్నట్టు కనిపించడం లేదు. బిజెపిలో అంతర్గత విభేదాలు ఈ మధ్యకాలంలో బయటపడడంతో ఇప్పటికిప్పుడు మండల కమిటీ వేస్తే మండల అధ్యక్షుని పోటీలో పోతంశెట్టిపల్లి గ్రామం చెందిన సీనియర్ నాయకులు నాగేందర్ రెడ్డి పోటీలో ఉండగా అది జీర్ణించుకోలేని ప్రస్తుత మండల అధ్యక్షుడు మండల కమిటీ ఎన్నికను ఇంకా కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిజెపిలోకి వస్తున్న కొత్త తరాన్ని ఆపుతున్నారని ఊహాగానాలు. మాసాయిపేట మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. జిల్లా కమిటీ తక్షణమే స్పందించి మాసాయిపేట మండలం , చేగుంట మండలం,నార్సింగ్ మండలం, మండల కమిటీ లేసి కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అవేవీ పట్టనట్టు మండల కమిటీ నాయకులు వ్యవహరించడం వల్ల యువనాయకత్వం బిజెపికి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మాసాయిపేట మండల కేంద్రంలో మండల కమిటీల్లో ఐదు నుండి పదిమంది మాత్రమే ఉండడం కొత్తవారిని ప్రోత్సహించకపోవడం రెండు వర్గాల మధ్య జరుగుతున్న వర్గ విభేదాలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని పలువురు సీనియర్ బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !