+91 95819 05907

మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షుని రేసులో నాగేందర్ రెడ్డి

అవకాశం ఇస్తే కొత్తతరాన్ని ముందుకు తీసుకొస్తానంటున్న నాగేందర్ రెడ్డి.

మాసాయిపేట మండలం నేటి గద్దర్ (భూపాల్) మార్చ్ 2.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి మండల కమిటీలు పూర్తికాగా మెదక్ జిల్లాలో అందుకు భిన్నంగా కొన్ని మండలాల్లో ఇప్పటివరకు కొత్తగా బిజెపి మండల నాయకులను ఎన్నుకోవడంలో అలసత్వం వహిస్తున్న మెదక్ జిల్లా బిజెపి నాయకత్వం. పూర్తి వివరాల్లోకి వెళితే ,మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎంపీ కార్యాలయం ఉండడం బిజెపి నాయకులకు ఒక గట్టి పునాది. కానీ మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి నాయకులు కార్యకర్తలలో విభేదాల కారణంగా ఇప్పటివరకు మండల కమిటీ వేయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షుని ఒంటెద్దు పోకడల కారణంగా బిజెపి కార్యకర్తలు సహకరించకపోవడంతో ఇప్పటివరకు మండల కమిటీ పూర్తి కాలేదని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉండాలని ఓవైపు బిజెపి అధినాయకత్వం నూతన కమిటీలు వేస్తూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సాహిస్తూ, ముందుకు తీసుకొస్తుంటే, మెదక్ జిల్లాలో మాత్రం కొన్ని మండలాల్లో ఇప్పటివరకు పాత నాయకులనే ఉంచడానికి గల కారణం ఏమిటో అర్థం కావడం లేదని, బిజెపి నాయకత్వానికి ప్రతి మండలంలో కొత్త నాయకుల ఎన్నిక ఎంతైన అవసరం ఉందని, కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం ఉన్న పాత నాయకులతో సరిపెట్టుకుందాం అంటే పాత నాయకులతో కలిసి రావడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరని పలుమార్లు జరిగిన మీటింగ్లలో చూసిన విధానమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం మండలంలో ఐదు నుంచి పది మంది వరకే మండల కమిటీకి వస్తున్నారని, అది కూడా ఒకటి రెండు ఊర్ల నుండి మాత్రమే బిజెపి కార్యకర్తలు రావడం ఎంత వరకు సమంజసమని, మిగిలిన గ్రామాల్లో నాయకత్వం బిజెపి పై సదభిప్రాయం ఉన్న మాసాయిపేట మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఇప్పటివరకు నూతనంగా గ్రామ కమిటీలు లేకపోవడం ఎవరి నిర్లక్ష్యమో అంతుపట్టడం లేదని ఊహాగానాలు.అందుకే బిజెపి నూతన మండల కమిటీని వేయడానికి ఎవరు కూడా సహకరిస్తున్నట్టు కనిపించడం లేదు. బిజెపిలో అంతర్గత విభేదాలు ఈ మధ్యకాలంలో బయటపడడంతో ఇప్పటికిప్పుడు మండల కమిటీ వేస్తే మండల అధ్యక్షుని పోటీలో పోతంశెట్టిపల్లి గ్రామం చెందిన సీనియర్ నాయకులు నాగేందర్ రెడ్డి పోటీలో ఉండగా అది జీర్ణించుకోలేని ప్రస్తుత మండల అధ్యక్షుడు మండల కమిటీ ఎన్నికను ఇంకా కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిజెపిలోకి వస్తున్న కొత్త తరాన్ని ఆపుతున్నారని ఊహాగానాలు. మాసాయిపేట మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. జిల్లా కమిటీ తక్షణమే స్పందించి మాసాయిపేట మండలం , చేగుంట మండలం,నార్సింగ్ మండలం, మండల కమిటీ లేసి కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అవేవీ పట్టనట్టు మండల కమిటీ నాయకులు వ్యవహరించడం వల్ల యువనాయకత్వం బిజెపికి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మాసాయిపేట మండల కేంద్రంలో మండల కమిటీల్లో ఐదు నుండి పదిమంది మాత్రమే ఉండడం కొత్తవారిని ప్రోత్సహించకపోవడం రెండు వర్గాల మధ్య జరుగుతున్న వర్గ విభేదాలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని పలువురు సీనియర్ బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !