మెదక్ జిల్లా న్యూస్ నేటి గదర్ మార్చి 6.
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయల సమీపంలో బస్టాండ్ వద్ద ఎండలు తీవ్రంగా ఉండడంతో రాధిక డయాగ్నిక్ సెంటర్ డాక్టర్ శ్రీధర్ సహకారంతో గ్రామానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ ప్రారంభించారు. అనంతరం చలివేంద్ర నిర్వాహకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు మండల నలుమూలల నుండి ప్రజలు రావడం జరుగుతుందని, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వివిధ పాఠశాలలు ఉండడంతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో చలివేంద్ర నిర్వాహకులు కంజర్ల చంద్రశేఖర్, నరేష్ గౌడ్, నిద్రబోయినస్వామి, కుమ్మరిలింగం, ఉడుత శ్రీమన్, తుపాకుల శ్రీనివాస్, బొమ్మెర బోయిన స్వామి,తదితరులు పాల్గొన్నారు.