+91 95819 05907

మహిళా దినోత్సవం సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి ని సన్మానించిన మహిళలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 7:- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు రామాయంపేట మండలం కేంద్రంలో మండల తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న తోటి మహిళా ఉద్యోగులు అందరు కలిసి తహసిల్దార్ రజనీకుమారి ని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళామణులు సాధించిన విజయాలను గుర్తించి,రేపటి రోజున మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.తాను రామాయంపేట మండల తహసిల్దారుగా 17 ఆగస్టు 2024న మొట్ట మొదటిసారిగా ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టినట్లు పేర్కొన్నారు.గత ఎనిమిది నెలలుగా తన కార్యాలయంలో 17 శాతం మహిళలు ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.సమాజంలో మహిళలను చిన్నచూపు చూడకుండా పురుషులతో సమానంగా మహిళలను గౌరవించాలని తెలిపారు.ఎలాంటి అపోహలకు గురికాకుండా పురుషులు మహిళల పట్ల తన సహోదరిగా భావించి గుర్తించాలని పేర్కొన్నారు.ఆరోజు నా కుటుంబం ఒక మహిళ అని చిన్నచూపు చూడకుండా నా వెన్నంటి ఉండి ఈరోజు వరకు ముందుకు నడిపిస్తేనే నేను ఒక బాధ్యత గల తహసిల్దార్ గా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు.అదేవిధంగా నా తోటి మండల సిబ్బంది మహిళలు ప్రజలకు అందించే సేవా కార్యక్రమాల్లో భాగంగా తనకు అన్ని విధాల కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.సమాజంలో మహిళలు ఎలాంటి మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు.ఈ సందర్భంగా మహిళలు మున్సిపాలిటీలో గ్రామాలల్లో అనారోగ్యాలకు గురికాకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఆమె వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండల మహిళా ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆ వలస ఆదివాసి గ్రామంలో టీవీ యాంకర్లు సందడి చేశారు.మన గ్రోమోర్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం

నేటి గదర్ న్యూస్,పినపాక: మండలంలోని గ్రామపంచాయతీ లోని తిల్లాపురం ఆదివాసి గ్రామంలో బిగ్ ఫేమస్ ఆర్టిస్టులు గీత రాయల్ శ్రీ సత్య పవిత్ర యాంకర్ అనిల్ జిలా గురువారం పర్యటించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో

Read More »

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

 Don't Miss this News !