+91 95819 05907

సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన చైతన్య మూర్తి సావిత్రిబాయి పూలే.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.

సావిత్రి భాయ్ పూలే వర్ధంతి సందర్భంగా ప్రవీలియన్ గ్రౌండ్ సమీపంలో ఉన్న సవత్రి భాయ్ పూలె ఆమె విగ్రహానికి పి డి ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పి డి ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన చైతన్య మూర్తి సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి మొదటి ఉపాధ్యాయుని శ్రీమతి సావిత్రిబాయి పూలే గారని అన్నారు.చిన్న వయసులోనే బాల్యవివాహం జరిగిన ఆమె ఉన్నత భావాలతో భర్త సహకారంతో చదువుకొని అందరికీ చదువు చెబుతూ ఆదర్శం అయ్యారన్నారు.

స్త్రీలు వంట ఇంటికి పరిమితం కావాలని గడప దాటి బయటికి వచ్చే స్వేచ్ఛను 18వ శతాబ్దంలో మనువాద ధర్మం కల్పించలేదు అటువంటి అణచివేతలకు, అసమానతలకు ,అంటరాని, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా ఆనాడు సావిత్రి భాయి పూలే స్త్రీలకు అనేక అవగాహన కార్యక్రమాలు కల్పించి,వారిని చైతన్య పరిచారని మనువాద ధర్మాన్ని సమాధి చేస్తూ మహిళలు అన్నిటిలో సమానులే అని ఎలుగెత్తి చాటి చెప్పి వారికి విద్యను అందించారని, భారతదేశంలో మొట్టమొదటి వెనకబడ్డ తరగతులకు పాఠశాల ప్రారంభించి వారికి విద్యను అందించిన చరిత సావిత్రిబాయి పూలేదని వారి సందర్భంగా కొనియాడారు భారత దేశంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక అసమానతలు మరియు నాణ్యతలేని విద్యా ప్రమాణాలు రేపటి తరానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయని వీటికి వ్యతిరేకంగా నేటి తరం విద్యార్థులు, యువకులు పోరాడాలని అదే సావిత్రిబాయికి మనం ఇచ్చే నిజమైన ఘన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు వినయ్ , తిరుపతి రావు అలేఖ్య, స్పందన, శిరీష, ప్రియాంక, ఝాన్సీ, ఉష, శైలజ తదితర నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలి :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

◆మార్చి 15లోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చెయ్యాలి ◆ప్రతి రైతు వ్యవసాయ భూమిలో ఫారం పాండ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ◆రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో

Read More »

జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి :సీఎం రేవంత్ రెడ్డి

*తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.* హైదరాబాద్ రవీంధ్రభారతిలో *కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

 Don't Miss this News !