హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 10.
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణిలో ఎమ్మార్పీఎస్ నాయకులు మెదక్ జిల్లా అధికారి ఆర్టిఏ డిటిఓ వెంకట్ స్వామి పై తక్షణమే చర్యలు తీసుకొని విధులనుంచి తొలగించాలని కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఏజెంట్ల వ్యవస్థను తొలగించాలని డిమాండ్ చేశారు.
మెదక్ రవాణా శాఖలో రాజ్యమేలుతున్న అవినీతిని
పట్టించుకోవడంలేదని జిల్లా కలెక్టర్ కు వివరించారు.
విధుల్లో అనధికార వ్యక్తులు అన్నింటా వారిదే పెత్తనం అంతట చెలరేగిపోతున్నారని గత 12 సంవత్సరాలుగా వీరిపై చర్యలు లేవన్నారు ఇకనైనా కలెక్టర్ స్పందించాలన్నారు.ఏజెంట్లు అధికారులకు నడుమ మధ్యవర్తిత్వం వారి ద్వారానే డబ్బు వసూళ్లు తెలిసినా పట్టించుకోని మెదక్ జిల్లా ఆర్టిఏ ఉన్నతాధికారులు లైసెన్సుల జారీ ఏజెంట్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ కార్యనిర్వాహక మెదక్ జిల్లా అధ్యక్షులు అస్త్రగళ్ల బాలరాజ్ మాదిగ,అధ్యక్షులు. ఎంఎస్ఎఫ్ నాయకులు సంజీవులు సంపత్ కుమార్ టిఎంఆర్పిఎస్ శ్రీనివాస్ ప్రభాకర్ సంజీవులు కృష్ణ నర్సింలు డిమాండ్ చేస్తూ గత 12 సంవత్సరాల నుండి
రవాణా శాఖలో అంతులేని అవినీతి రాజ్యమేలుతోంది. పట్టించుకునే నాధుడే కరువయ్యారు ప్రైవేట్ వ్యక్తులే అధికారులుగా చలామణి అవుతూ విధులు నిర్వర్తిస్తున్న తీరు విస్తుగొల్పుతోంది. వారి చేతుల్లోనే కీలక పైళ్లు, వాటిపై నెంబర్ల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. లాగిన్ ఐడీ, పాస్ వర్డ్స్ కూడా ఉండటం ఇందుకు నిదర్శం రవాణా శాఖలో కొందరు అధికారులు బినామీ వ్యక్తులను నియమిం చుకుని వారి ద్వారానే ఏజెంట్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు ఉన్నతమైన అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు ఏళ్ల తరబడిగా ఈ అక్రమ లైసెన్స్ జారీ కొనసాగుతున్నప్ప టికీ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంపై కమిషన్ల కకృతి కారణంగానే జాప్యం జరుగుతుందని అన్నారు ఆర్టిఏ బినామీ వారి కనుసన్నల్లోనే ఇదంతా ఇంత అవినీతి జరుగుతుంటే జిల్లా కలెక్టర్ గారు పట్టించకపోవడం కారణంగానే అనధికారికంగా బినామీ ఏజెంట్లు ఇచ్చే లైసెన్సుల ద్వారా నిరుద్యోగ జీవితాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోతున్న జిల్లా యంత్రాంగానికి పట్టింపు లేదన్నారు పూర్తిగా లైసెన్సుల ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేయాలని ఇప్పటికైనా గుర్తుతెలియని వారు లైసె న్స్ కార్యకపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ వ్యక్తులతో విధులు నిర్వహిస్తున్న కారణమైన కారకులైన జిల్లా రవాణా అధికారులపై వీరికి అండగా నిలిచే వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు అనంతరం డిమాండ్ చేశారు.
ఇకనైనా యువత తన డ్రైవింగ్ లైసెన్స్ విధానాల పట్ల పూర్తి అవగాహన ప్రభుత్వ ద్వారా పరచాలన్నారు ఎవరికి అవగాహన లేని కారణంగానే మెదక్ రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతి నిలయంగా మారింది ఇకనైనా అరికట్టేందుకు ప్రభుత్వం నిఘా ద్వారా ఎన్ని సంస్కరణలు తీసుకువస్తున్నా అధికారుల లంచాల వసూళ్ల పనితీరు మారడం లేదన్నారు అవినీతిని అంతకంతకూ ప్రోత్సహించే కార్యాలయ సిబ్బందిని గుర్తించాలన్నారు ఇకనైనా బినామీ ఏజెంట్ల వ్యవస్థను నియంత్రించకుంటే నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల పట్ల లారీలు ఇతర వాహనాలను ద్వారా పొందే ఫిట్నెస్ సర్టిఫికెట్లు లైసెన్స్లను పూర్తిస్థాయిలో గుర్తించాలన్నారు అనధికారికంగా లైసెన్సులు ఇచ్చే బ్రోకర్లపై నిబంధనల నియంత్రణ లేకపోవడం వలన ఏజెంట్ల సిబ్బంది విచ్చలవిడిగా చెలరేగుతున్నారని వారు డిమాండ్ చేశారు.