+91 95819 05907

వీరనారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రీబాయి పులే వర్ధంతి.

నేటిగదర్ న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి మార్చి10:- వీర నారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో సావిత్రీబాయి పులే వర్ధంతినీ ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం నగరం లోని కిమ్స్ హాస్పటల్ సమీపంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పుల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి మాట్లాడుతూ.. మహిళల కోసం అహర్నిశలు పాటుపడి, పురుషులతో పాటు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి. పోరాడిన సావిత్రి బాయి పులే పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో అధ్యయనం కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సావిత్రీబాయి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని అన్నారు. జయంతి, వర్దంతులను కూడా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సూచించారు. సావిత్రీబాయి చిత్రపటాలు ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ఉండేలా ప్రభుత్వం ఓ సర్కులర్ జారీ చేయాలన్నారు. మహిళా చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడమే సావిత్రీబాయి కి అర్పించే నిజమైన నివాళి అని ఉపేంద్రబాయి అన్నారు. అనంతరంవీరణరీమణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యదర్శి కె. స్పందన మాట్లాడుతూ.. మహిళలకు దక్కాల్సిన రిజర్వేషన్ కోటను అమలుచేసి, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అనేక అవకాలు కల్పించేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్యా జ్యోతి, ప్రధానకార్యదర్శి విజయ, సహాయ కార్యదర్శి ప్రియాంక, అధికార ప్రతినిధి పి. లక్ష్మి, ఆ సంఘం నాయకురాలు ఝాన్సి, సుభద్ర, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

జగన్నాధపురం – గోకినపల్లి R&B రోడ్డు విస్తరణ కొరకు 25 కోట్ల నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి జగన్నాధపురం నుండి గోకినపల్లి వరకు 19 కిలోమీటర్ల మేర విస్తరించిన R&B రహదారి అభివృద్ధిలో భాగంగా మత్కేపల్లి-జగన్నాధపురం R&B రోడ్డు నుండి మత్కేపల్లి గ్రామం మున్నేరు నది

Read More »

14 నెలలోనే మెదక్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చా: ఎమ్మెల్యే మైనంపల్లి

*పది సంవత్సరాల లో చేయని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో 14 నెలలలోనే మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం జరుగుతుందని విద్య వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ మెరుగుపరచడం జరుగుతుంది.* మెదక్

Read More »

జీవితంపై విరక్తి చెంది యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 11:- మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం నాడు వట్టపు స్వామి వయస్సు (32) సంవత్సరాలు వృత్తి వ్యవసాయం తండ్రి ఆగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు

Read More »

 Don't Miss this News !