నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 11: దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం విస్తృతంగా పర్యటించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జమేదార్ బంజర్, పార్కలగండి, బాలరాజుగూడెం, జగ్గారం, అంకంపాలెం, ఆర్లపెంట పూసుకుంట గ్రామపంచాయతీలలో ఒక కోటి నలభైతొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్ల పనులను భూమిపూజలు చేసి ఎమ్మెల్యే జారే చేతులతో ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 21