వార బంధీ సడలించి ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందించాలి.
ధాన్యం బోనస్, రుణమాఫీ, రైతు భరోసా పెండింగ్ విడుదల చేయాలి.
మిర్చి మద్దతు ధర క్వింటాకు రూ 25 వేల రూపాయలు
ఖమ్మం లో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రం
నేటిగదర్ న్యూస్, వైరా,మార్చి 11:- ఖమ్మం జిల్లా లో మిర్చి బోర్డు ఏర్పాటు కు చొరవ చూపాలి అని, మిర్చి క్వింటాళ్ల కు ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర నిర్ణయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నా ఫెడ్ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి అని కోరుతూ మంగళవారం వైరా మండలం పుణ్యపురం గ్రామం లో ఇందిరమ్మ ఇళ్లు శుకుస్తాపన కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస రెడ్డి కి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఖమ్మం జిల్లా లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వివరించారు. ఖమ్మం జిల్లా లో 80 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని, గత రెండు సీజన్లో మిర్చి క్వింటాళ్ల కు ఇరవై ఐదు వేల రూపాయలు ధర ఉంటే నేడు 12, 13 వేల రూపాయలు ధర మాత్రమే రైతులు పొందుతూ ఉన్నారు అని అన్నారు.మిర్చి ఎగుమతులు , దేశీయ అవసరాలు, నూతన వంగడాలు పై తెగుళ్లు వైరస్ ల పై పరిశోధనలు సమగ్ర విధానం కోసం దేశంలో అత్యధిక విస్తీర్ణంలో మిర్చి సాగు అవుతు నాణ్యమైన మిర్చి దిగుబడులు సాధించిన ఖమ్మం జిల్లా లో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు వైరా మండలం లో సన్న రకాల ధాన్యం బోనస్ 3000 మంది రైతులకు 9 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందని ఖమ్మం జిల్లా లో 23,345, మంది రైతులకు 65 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని వివరించారు, రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది అన్నారు, రైతు భరోసా అలస్యం అవుతుంది అని అన్నారు ఖమ్మం జిల్లా లో సాగర్ ఆయకట్టు పరిధిలో,ఇతర ప్రాజెక్టులు పరిధిలో వారబంధి ఎత్తివేసిన ఆయకట్టు పరిధిలో చివరి భూములకు సాగు నీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలి అని విజ్ఞప్తి చేశారు.
సిరిపురం –పుణ్యపురం కుర్నవల్లి లింక్ రోడ్డు బిటి రోడ్డు చేయాలని కోరారు
మంత్రి పోంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ
రైతుల సమస్యలు పరిష్కారం చేయుటకు తనవంతు ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు,సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు,మాజీ సర్పంచ్ పారుపల్లి కృష్ణారావు,కట్టా దుర్గయ్య, చలపతి రెడ్డి,అయిలూరి శేషు రెడ్డి,వడ్లమూడి మధు, అమరనేని కృష్ణ, మాడపాటి రాజేష్, రైతులు పాల్గొన్నారు.