+91 95819 05907

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు
★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన వైరా పట్టణంలో గల సుందరయ్య నగర్ లో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక వృద్ధ మహిళను కాళ్లు చేతులు కట్టివేసి చోరీ కి పాల్పడిన సంచలన కేసులో మంగళవారం నలుగురు నిందితులను వైరా పోలీసులు పట్టుకున్నారు. వైరా ACP రెహమాన్ పర్యవేక్షణలో వైరా సీఐ సాగర్, వైరా ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజ్, తల్లాడ ఎస్, మరియు పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీచేపడుతుండగా నెమలి- దాసాపురం ఆంధ్ర, తెలంగాణ అయిన రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అనుమానంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని విచారించగా ఫిబ్రవరి 12వ తేదీన వృద్ధ మహిళ ఇంటిలోకి చోరీకి పాల్పడిన నిందితులుగా గుర్తించారు. పోలీసుల కథనం మేరకు ఈ నలుగురు నిందితులు కారుకు నకిలీ నెంబర్ ప్లేట్ తో మధ్యాహ్నం పూట ఆ వృద్ధ మహిళ ఇంటికి వెళ్లారు అందులో ఒకరు పోలీసు దుస్తులు ధరించి ఉన్నాడు. ఆమెతో నీ కొడుకు గంజాయి అమ్ముతున్నాడు అనిఇంట్లో చోరీ చేయాలని నెపంతో ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా ఆమె కాళ్లు చేతులు కట్టి కట్టివేసి నోటికి పాస్టర్ అంటించి నెట్టిపడేశారు.ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగలను దోచుకుని,బీరువా తెరిచి అందులో సొమ్ము, బంగారం దోసుకెళ్లారు. ఈ నిందితులలో A1 గా రాయపాటి వెంకన్న, అలియాస్ వెంకన్న,అలియాస్ దొంగల వెంకన్న,అలియాస్ వెంకటేష్, అలియాస్ రెడ్డి, కాగా ఇతనిపై మొత్తం 30 కేసులు ఉన్నాయిA2 నాగుల్ మీరా ఇతడు పై పది కేసులు ఉన్నాయి A3 గా ముత్తు, అలియాస్ ముత్తు మురుగేషన్ ఇతనిపై 11 కేసులు ఉన్నాయి.A4 గా విజయ్ కుమార్ ఇతడిపై నాలుగు కేసులు ఉన్నాయి. అని వైరా పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు.ఇది ఇలా ఉండగా నిద్రాహారాలు మాని ఈ కేసులో నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

హొలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ సూచన ఇదే

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి

Read More »

 Don't Miss this News !