+91 95819 05907

రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యం.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.

* టీడబ్ల్యూజేఎఫ్ వినతిపై జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ స్ఫందన
* మంచి ఆలోచనని టీడబ్ల్యూజేఎఫ్ కు కలెక్టర్ అభినందనలు
* అదనపు కలెక్టర్ శ్రీజాకు జాబితా ఇవ్వాల్సిందిగా సూచన

ఖమ్మం; ఏప్రిల్ 2; 2025:
రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఐడీవోసీలో బుధవారం అందజేసిన వినతిపత్రంపై కలెక్టర్ స్పందించారు. మంచి సూచన చేశారంటూ టీడబ్ల్యూజేఎఫ్ నేతలను అభినందించారు. అప్లికేషన్ చేసుకుని జాబితాను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజాకు ఇస్తే ఆమె వాటిని పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటారన్నారు. నిరుద్యోగులకు ఉద్దేశించిన పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వటం సముచితమన్నారు. జర్నలిస్టులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కాబట్టి వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ సూచన మేరకు అల్పాదాయ వర్గాలకు చెందిన జర్నలిస్టులకు రాజీవ్ యువ వికాసంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. జర్నలిస్టులు దరఖాస్తు చేసుకొని, అప్లికేషన్ నంబర్ టీడబ్ల్యూజేఎఫ్ నేతలకు సమర్పిస్తే వారు ఆ వివరాలను అదనపు కలెక్టర్ కు అందజేస్తారన్నారు. రాజీవ్ యువ వికాసంలో ఎక్కువ మంది జర్నలిస్టులకు లబ్ధి చేకూర్చేలా చూస్తామన్నారు. కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన వారిలో
టీడబ్ల్యూజేఎఫ్, ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నేతలు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, కూరాకుల గోపీ, ఆవుల శ్రీనివాస్, వేగినాటి మాధవ్, షేక్ జానీపాష, మధుశ్రీ, దేవేందర్, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, అర్షద్, గణేశ్, ఫయాజ్, జాకీర్, ఉపేందర్ తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !