+91 95819 05907

రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యం.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.

* టీడబ్ల్యూజేఎఫ్ వినతిపై జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ స్ఫందన
* మంచి ఆలోచనని టీడబ్ల్యూజేఎఫ్ కు కలెక్టర్ అభినందనలు
* అదనపు కలెక్టర్ శ్రీజాకు జాబితా ఇవ్వాల్సిందిగా సూచన

ఖమ్మం; ఏప్రిల్ 2; 2025:
రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఐడీవోసీలో బుధవారం అందజేసిన వినతిపత్రంపై కలెక్టర్ స్పందించారు. మంచి సూచన చేశారంటూ టీడబ్ల్యూజేఎఫ్ నేతలను అభినందించారు. అప్లికేషన్ చేసుకుని జాబితాను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజాకు ఇస్తే ఆమె వాటిని పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటారన్నారు. నిరుద్యోగులకు ఉద్దేశించిన పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వటం సముచితమన్నారు. జర్నలిస్టులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కాబట్టి వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ సూచన మేరకు అల్పాదాయ వర్గాలకు చెందిన జర్నలిస్టులకు రాజీవ్ యువ వికాసంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. జర్నలిస్టులు దరఖాస్తు చేసుకొని, అప్లికేషన్ నంబర్ టీడబ్ల్యూజేఎఫ్ నేతలకు సమర్పిస్తే వారు ఆ వివరాలను అదనపు కలెక్టర్ కు అందజేస్తారన్నారు. రాజీవ్ యువ వికాసంలో ఎక్కువ మంది జర్నలిస్టులకు లబ్ధి చేకూర్చేలా చూస్తామన్నారు. కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన వారిలో
టీడబ్ల్యూజేఎఫ్, ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నేతలు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, కూరాకుల గోపీ, ఆవుల శ్రీనివాస్, వేగినాటి మాధవ్, షేక్ జానీపాష, మధుశ్రీ, దేవేందర్, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, అర్షద్, గణేశ్, ఫయాజ్, జాకీర్, ఉపేందర్ తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !