+91 95819 05907

రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యం.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.

* టీడబ్ల్యూజేఎఫ్ వినతిపై జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ స్ఫందన
* మంచి ఆలోచనని టీడబ్ల్యూజేఎఫ్ కు కలెక్టర్ అభినందనలు
* అదనపు కలెక్టర్ శ్రీజాకు జాబితా ఇవ్వాల్సిందిగా సూచన

ఖమ్మం; ఏప్రిల్ 2; 2025:
రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఐడీవోసీలో బుధవారం అందజేసిన వినతిపత్రంపై కలెక్టర్ స్పందించారు. మంచి సూచన చేశారంటూ టీడబ్ల్యూజేఎఫ్ నేతలను అభినందించారు. అప్లికేషన్ చేసుకుని జాబితాను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజాకు ఇస్తే ఆమె వాటిని పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటారన్నారు. నిరుద్యోగులకు ఉద్దేశించిన పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వటం సముచితమన్నారు. జర్నలిస్టులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కాబట్టి వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ సూచన మేరకు అల్పాదాయ వర్గాలకు చెందిన జర్నలిస్టులకు రాజీవ్ యువ వికాసంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. జర్నలిస్టులు దరఖాస్తు చేసుకొని, అప్లికేషన్ నంబర్ టీడబ్ల్యూజేఎఫ్ నేతలకు సమర్పిస్తే వారు ఆ వివరాలను అదనపు కలెక్టర్ కు అందజేస్తారన్నారు. రాజీవ్ యువ వికాసంలో ఎక్కువ మంది జర్నలిస్టులకు లబ్ధి చేకూర్చేలా చూస్తామన్నారు. కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన వారిలో
టీడబ్ల్యూజేఎఫ్, ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నేతలు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, కూరాకుల గోపీ, ఆవుల శ్రీనివాస్, వేగినాటి మాధవ్, షేక్ జానీపాష, మధుశ్రీ, దేవేందర్, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, అర్షద్, గణేశ్, ఫయాజ్, జాకీర్, ఉపేందర్ తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !