నేటి గదర్ న్యూస్,మహబూబాద్ ప్రతినిధి:గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలకు విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా.రామచంద్రు నాయక్
హాజరయ్యారు. గురువారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బంజారాహిల్స్ సంత్ సేవాలాల్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని అభివర్ణించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం E.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో దూసుకపోవడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింహులపేట మండల సేవలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు భూక్య దేవిలాల్ – హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 70