+91 95819 05907

ట్యాంక్ బండ్ పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తా:CM

* స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ దూదిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ హైదరాబాద్ నడి ఒడ్డు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై తెలంగాణ రాష్ట్రానికి చెంది దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సాధించిన ప్రముఖుల విగ్రహాలను భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.శనివారం మంత్రి, మంథని ఎమ్మెల్యే దూదిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంత్రి తండ్రి దివంగత శ్రీపాద రావు జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన దూదిళ్ళ శ్రీపాద రావు 87వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. తొలిత ఆయన శ్రీపాదరావు విగ్రహానికి పూలమానులు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మృత్యువు నక్సల్స్ రూపంలో కబళించిందని గుర్తు చేశారు.శ్రీపాదరావు రాష్ట్రం కోసం, దేశం కోసం చేసిన సేవలు మరువలేనిమన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ట్యాంక్ బండ్ పై విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.ఆదివాసీ ల పోరాట యోధుడు కొమరం భీం, బిర్సా ముండా, సర్ధార్ పాపన్న గౌడ్,మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి స్పీకర్లు మంత్రులు, శ్రీపాదరావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

Surya peta: వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు.

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు. వరంగల్ లో జరుగనున్న BRS రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు.. BRS రజతోత్సవ సభకు మేముసైతం

Read More »

పినపాకలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు .

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా జరిగాయి. పినపాక మండల తెలుగు దేశం పార్టీ

Read More »

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు. మహదేవపురం ఎత్తిపోతల పథకం – సాగునీటి సరఫరాలో చరిత్రాత్మక ముందడుగు ఖమ్మం జిల్లా,మధిర మండలం,

Read More »

మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

. బునియది ఆదివాసి, కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

Read More »

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం

Read More »

 Don't Miss this News !