+91 95819 05907

JULURUPAD:మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి:MLA

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

జూలూరుపాడు, నేటి గదర్ ప్రతినిధి, మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నా శక్తి మేర మున్నూరు కాపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ను సోమవారం ఉదయం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మున్నూరు కాపు న్యాయమైన హక్కుల సాధన కోసం వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 5000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి, వైరా నియోజకవర్గంలో తనకు లక్ష ఓట్లు రావడానికి మున్నూరు కాపులు ప్రధాన భూమిక పోషించారని వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతు వారికి రుణపడి ఉంటానని అన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోను జిల్లా మంత్రుల తోనూ చర్చించి కార్పొరేషన్ ఏర్పాటుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, అదే విధంగా మున్నూరు కాపు సమస్యలన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తన గెలుపుకు సహకరించిన వైరా నియోజకవర్గ మున్నూరు కాపులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపట్ల మురళి, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు, మండల ఉపాధ్యక్షులు గోపు రామకృష్ణ, తాటికొండ వెంకటరాం ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మల్లెల నాగేశ్వరరావు, మండల కోశాధికారి రామిశెట్టి నాగేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శి ఉసికల వెంకటేశ్వర్లు, మండల నాయకులు పగడాల అఖిల్, పాలెపు భద్రయ్య, వడ్డే నరసింహారావు, తోట శ్రీను, పపిన్ని వెంకయ్య, పాపిని జనార్ధన్, చౌడం నాగరాజు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !