+91 95819 05907

JULURUPAD:మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి:MLA

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

జూలూరుపాడు, నేటి గదర్ ప్రతినిధి, మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నా శక్తి మేర మున్నూరు కాపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ను సోమవారం ఉదయం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మున్నూరు కాపు న్యాయమైన హక్కుల సాధన కోసం వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 5000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి, వైరా నియోజకవర్గంలో తనకు లక్ష ఓట్లు రావడానికి మున్నూరు కాపులు ప్రధాన భూమిక పోషించారని వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతు వారికి రుణపడి ఉంటానని అన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోను జిల్లా మంత్రుల తోనూ చర్చించి కార్పొరేషన్ ఏర్పాటుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, అదే విధంగా మున్నూరు కాపు సమస్యలన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తన గెలుపుకు సహకరించిన వైరా నియోజకవర్గ మున్నూరు కాపులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపట్ల మురళి, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు, మండల ఉపాధ్యక్షులు గోపు రామకృష్ణ, తాటికొండ వెంకటరాం ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మల్లెల నాగేశ్వరరావు, మండల కోశాధికారి రామిశెట్టి నాగేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శి ఉసికల వెంకటేశ్వర్లు, మండల నాయకులు పగడాల అఖిల్, పాలెపు భద్రయ్య, వడ్డే నరసింహారావు, తోట శ్రీను, పపిన్ని వెంకయ్య, పాపిని జనార్ధన్, చౌడం నాగరాజు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !