+91 95819 05907

JULURUPAD:మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి:MLA

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

జూలూరుపాడు, నేటి గదర్ ప్రతినిధి, మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నా శక్తి మేర మున్నూరు కాపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ను సోమవారం ఉదయం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మున్నూరు కాపు న్యాయమైన హక్కుల సాధన కోసం వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 5000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి, వైరా నియోజకవర్గంలో తనకు లక్ష ఓట్లు రావడానికి మున్నూరు కాపులు ప్రధాన భూమిక పోషించారని వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతు వారికి రుణపడి ఉంటానని అన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోను జిల్లా మంత్రుల తోనూ చర్చించి కార్పొరేషన్ ఏర్పాటుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, అదే విధంగా మున్నూరు కాపు సమస్యలన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తన గెలుపుకు సహకరించిన వైరా నియోజకవర్గ మున్నూరు కాపులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపట్ల మురళి, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు, మండల ఉపాధ్యక్షులు గోపు రామకృష్ణ, తాటికొండ వెంకటరాం ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మల్లెల నాగేశ్వరరావు, మండల కోశాధికారి రామిశెట్టి నాగేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శి ఉసికల వెంకటేశ్వర్లు, మండల నాయకులు పగడాల అఖిల్, పాలెపు భద్రయ్య, వడ్డే నరసింహారావు, తోట శ్రీను, పపిన్ని వెంకయ్య, పాపిని జనార్ధన్, చౌడం నాగరాజు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 6

Read More »

 Don't Miss this News !