+91 95819 05907

MULAKALAPALLI:రైతు నేస్థం సరే!రైతులను ముంచిన బాలాజీ పర్టిలైజర్స్ షాపు పై చర్యలు తీసుకోరా?:CPI ml mass line

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
★నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు న్యాయం చేయాలి.
★ రైతు లు విక్రయించిన బాలాజీ పర్టిలైజర్స్ షాపు పై క్రిమినల్ కేసులు నామోదు చేయాలి.
★రైతు నేస్థం అని ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహించే ప్రభుత్వానికి గిరిజన రైతుల గోడు కనబడుటలేదా.
★సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ

నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు నష్టం పరిహారం అందించి,విత్తనాలు అందించిన విత్తనాల దుకాణం పై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ గురువారం డిమాండ్ చేసారు.నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు మద్దతుగా జన్నాథపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అఖిలభారత ప్రగతి శీల రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాళ్ళపాయ గ్రామములో నకిలీ విత్తనాలతో మోసపోయింది గిరిజన రైతులు కాబట్టే న్యాయం చేయడంలో అధికారులు,ప్రభుత్వం,విత్తన కంపెనీలు ఉదాసీనత వహిస్తున్నాయని,ఇదే బాలాజీ ఫెర్టిలైజర్ విత్తనాల దుకాణం లో మాదారం గ్రామానికి చెందిన గిరిజనేతర రైతు కు కాలం చెల్లిన పురుగు మందులు విక్రయించి పది ఎకరాలలో పంట నష్టపోయిన దాకలాలు అనేకం వున్నాయన్నారు.లాభార్జనే ధ్యేయంగా నకిలీ లతో అమాయక గిరిజన రైతులను నకిలీలతో మోసం చేస్తున్న బాలాజీ పర్టిలైజర్స్ విత్తనాల దుకాణం పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని,గిరిజన రైతుకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.గిరిజన రైతులకు న్యాయం చేయాని పక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పోతుగంటి లక్ష్మణ్,యర్రగొర్ల రామారావు,నకిరకంటి నాగేశ్వరరావు,పొడియం రాజు,మడివి మహేష్ మరియు మడకం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

 Don't Miss this News !