+91 95819 05907

MULAKALAPALLI:రైతు నేస్థం సరే!రైతులను ముంచిన బాలాజీ పర్టిలైజర్స్ షాపు పై చర్యలు తీసుకోరా?:CPI ml mass line

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
★నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు న్యాయం చేయాలి.
★ రైతు లు విక్రయించిన బాలాజీ పర్టిలైజర్స్ షాపు పై క్రిమినల్ కేసులు నామోదు చేయాలి.
★రైతు నేస్థం అని ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహించే ప్రభుత్వానికి గిరిజన రైతుల గోడు కనబడుటలేదా.
★సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ

నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు నష్టం పరిహారం అందించి,విత్తనాలు అందించిన విత్తనాల దుకాణం పై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ గురువారం డిమాండ్ చేసారు.నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు మద్దతుగా జన్నాథపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అఖిలభారత ప్రగతి శీల రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాళ్ళపాయ గ్రామములో నకిలీ విత్తనాలతో మోసపోయింది గిరిజన రైతులు కాబట్టే న్యాయం చేయడంలో అధికారులు,ప్రభుత్వం,విత్తన కంపెనీలు ఉదాసీనత వహిస్తున్నాయని,ఇదే బాలాజీ ఫెర్టిలైజర్ విత్తనాల దుకాణం లో మాదారం గ్రామానికి చెందిన గిరిజనేతర రైతు కు కాలం చెల్లిన పురుగు మందులు విక్రయించి పది ఎకరాలలో పంట నష్టపోయిన దాకలాలు అనేకం వున్నాయన్నారు.లాభార్జనే ధ్యేయంగా నకిలీ లతో అమాయక గిరిజన రైతులను నకిలీలతో మోసం చేస్తున్న బాలాజీ పర్టిలైజర్స్ విత్తనాల దుకాణం పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని,గిరిజన రైతుకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.గిరిజన రైతులకు న్యాయం చేయాని పక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పోతుగంటి లక్ష్మణ్,యర్రగొర్ల రామారావు,నకిరకంటి నాగేశ్వరరావు,పొడియం రాజు,మడివి మహేష్ మరియు మడకం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !