నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పినపాక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గడ్డంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళా నాయకురాలు గొంది రాధ మాట్లాడుతూ మహిళ అబల కాదు సబల అని అన్నారు. నేటికీ, మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు, వీటిని మహిళా లోకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించి పరిష్కారం కనిపెట్టాలన్నారు. అనంతరం మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, స్థానిక మహిళలు పాల్గొన్నారు
Post Views: 90









