+91 95819 05907

VENKATAPURAM: షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఒప్పుకోం

*గిరిజన చట్టాలను సమాధి చేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ది చెందుతుందా..?*

*ప్రత్యేక ఆర్డినెన్సు తెచ్చి 29 ప్రభుత్వ శాఖల్లో ఆదివాసీలను నియమించాలి* రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు డిమాండ్..

నేటి గదర్ న్యూస్ ప్రతినిధి: వెంకటాపురం

రాష్ట్రంలో అభివృద్ధి గిరిజనుల సమాధుల పైన జరుగుతోంది అని ఆదివాసీ నవనిర్మాణ సేన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు
ఆరోపించారు. ఆదివారం ఒంటిమామిడి గ్రామం లో మండల ప్రధాన కార్యదర్శి కుంజ మహేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిదులు గా , ఏ ఎన్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు పాల్గొన్నారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాల వల్ల దేశం లోనీ ఆదివాసీల జీవన విధానం అధమ స్థానానికి చేరుకుందనీ మండిపడ్డారు. పదకొండో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గృహలక్ష్మి పథకం ను ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో ఆదివాసీ నవనిర్మాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ఈ విధంగా స్పందించారు. షెడ్యూల్డ్ చట్టాలను సమాధి చేయడానికి భద్రాచలం వస్తున్నావా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. షెడ్యూల్డ్ ప్రాంతమైన భద్రాచలం నియోజక వర్గంలో వలస గిరిజనేతరులకు 1/70 చట్ట విరుద్ధంగా గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు ఎలా కేటాయిస్తారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ, రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ఐదవ షెడ్యూల్డ్ ఏరియా గిరిజన చట్టాలను ఉల్లంఘించడం పైన నాగరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తచేశారు. ప్రభుత్వాలు, పాలకులు మారిన గిరిజన చట్టాల పైన వారి వైఖరి మారడం లేదన్నారు. నీళ్ళు ,నిధులు,నియామకాలు ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిజానికి దోపిడీకి గురయ్యేది ఆదివాసీలే అని అన్నారు. ఏజెన్సీ ప్రాంతం లోని గోదావరి జలాలు, ఖనిజ సంపద, ఉద్యోగాలు అన్ని అన్యాక్రాంతం అవుతున్నటున్నట్లు ఆయన తెలియజేశారు. ఐదో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో తిష్ట వేసిన దోపిడీ దారులు అయిన వలస గిరిజనేతరులను మైదాన ప్రాంతానికి రలించి, వారి అక్రమ ఆస్తులను ఆదివాసీలకు పంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ డిమాండ్ చేశారు. గడిసిన ఎన్నికల్లో ఆదివాసీ లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన్నప్పటికి ప్రభుత్వం మాత్రం బంజారాలు, గిరిజనేతరుల పక్షాన నిలబడటం దుర్మార్గపు చర్య అన్నారు. ఉమ్మడి షెడ్యూల్డ్ మండలాలను గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసి గిరిజన ఉప ప్రణాళిక గ్రామాలను సైతం మైదాన ప్రాంతాల్లో కలిపి గిరిజనుల జీవన విధ్వంసానికి కారణం అయిందని పేర్కొన్నారు. ఉమ్మడి షెడ్యూల్డ్ మండలాలను ఆ నియోజకవర్గ ,జిల్లాల పరిధిలోనే మరలా యదా తదంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతం లోని ఆదివాసీ నిరుద్యోగుల కోసం ప్రత్యేకమైన ఆర్డినెన్సు సత్వరమే తీసుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.అధికరణ 244 ప్రకారం ఐదో షెడ్యూల్డ్ ప్రాంతం స్వయం ప్రతిపత్తి కలిగినది కాబట్టి 29 ప్రభుత్వ శాఖల్లో ఆదివాసీల చేతనే నియమించాలని అన్నారు.ఈ కార్యక్రమం పోతురాజు, గోపి, గణేష్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !