+91 95819 05907

VENKATAPURAM: షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఒప్పుకోం

*గిరిజన చట్టాలను సమాధి చేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ది చెందుతుందా..?*

*ప్రత్యేక ఆర్డినెన్సు తెచ్చి 29 ప్రభుత్వ శాఖల్లో ఆదివాసీలను నియమించాలి* రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు డిమాండ్..

నేటి గదర్ న్యూస్ ప్రతినిధి: వెంకటాపురం

రాష్ట్రంలో అభివృద్ధి గిరిజనుల సమాధుల పైన జరుగుతోంది అని ఆదివాసీ నవనిర్మాణ సేన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు
ఆరోపించారు. ఆదివారం ఒంటిమామిడి గ్రామం లో మండల ప్రధాన కార్యదర్శి కుంజ మహేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిదులు గా , ఏ ఎన్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు పాల్గొన్నారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాల వల్ల దేశం లోనీ ఆదివాసీల జీవన విధానం అధమ స్థానానికి చేరుకుందనీ మండిపడ్డారు. పదకొండో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గృహలక్ష్మి పథకం ను ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో ఆదివాసీ నవనిర్మాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ఈ విధంగా స్పందించారు. షెడ్యూల్డ్ చట్టాలను సమాధి చేయడానికి భద్రాచలం వస్తున్నావా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. షెడ్యూల్డ్ ప్రాంతమైన భద్రాచలం నియోజక వర్గంలో వలస గిరిజనేతరులకు 1/70 చట్ట విరుద్ధంగా గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు ఎలా కేటాయిస్తారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ, రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ఐదవ షెడ్యూల్డ్ ఏరియా గిరిజన చట్టాలను ఉల్లంఘించడం పైన నాగరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తచేశారు. ప్రభుత్వాలు, పాలకులు మారిన గిరిజన చట్టాల పైన వారి వైఖరి మారడం లేదన్నారు. నీళ్ళు ,నిధులు,నియామకాలు ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిజానికి దోపిడీకి గురయ్యేది ఆదివాసీలే అని అన్నారు. ఏజెన్సీ ప్రాంతం లోని గోదావరి జలాలు, ఖనిజ సంపద, ఉద్యోగాలు అన్ని అన్యాక్రాంతం అవుతున్నటున్నట్లు ఆయన తెలియజేశారు. ఐదో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో తిష్ట వేసిన దోపిడీ దారులు అయిన వలస గిరిజనేతరులను మైదాన ప్రాంతానికి రలించి, వారి అక్రమ ఆస్తులను ఆదివాసీలకు పంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ డిమాండ్ చేశారు. గడిసిన ఎన్నికల్లో ఆదివాసీ లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన్నప్పటికి ప్రభుత్వం మాత్రం బంజారాలు, గిరిజనేతరుల పక్షాన నిలబడటం దుర్మార్గపు చర్య అన్నారు. ఉమ్మడి షెడ్యూల్డ్ మండలాలను గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసి గిరిజన ఉప ప్రణాళిక గ్రామాలను సైతం మైదాన ప్రాంతాల్లో కలిపి గిరిజనుల జీవన విధ్వంసానికి కారణం అయిందని పేర్కొన్నారు. ఉమ్మడి షెడ్యూల్డ్ మండలాలను ఆ నియోజకవర్గ ,జిల్లాల పరిధిలోనే మరలా యదా తదంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతం లోని ఆదివాసీ నిరుద్యోగుల కోసం ప్రత్యేకమైన ఆర్డినెన్సు సత్వరమే తీసుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.అధికరణ 244 ప్రకారం ఐదో షెడ్యూల్డ్ ప్రాంతం స్వయం ప్రతిపత్తి కలిగినది కాబట్టి 29 ప్రభుత్వ శాఖల్లో ఆదివాసీల చేతనే నియమించాలని అన్నారు.ఈ కార్యక్రమం పోతురాజు, గోపి, గణేష్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !