కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ జిల్లా కార్యాలయం కూలి లైన్ లో ఏర్పాటుచేసిన సంఘంసావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి పూలే జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే . ఈ సమాజానికి అక్షరం బిక్ష పెట్టిన తల్లి సావిత్రిబాయి పూలే గారని ఆమె లేకపోతే మనకు ఈ అక్షరమే లేదని..అన్నారు కానీ నేడు ఈ దేశాన్ని పాలిస్తున్న అగ్రకులాలు మళ్లీ మనువాదంతో అణగారిన కులాలకు విద్యను దూరం చేస్తున్న విషయం మనకు తెలిసిందే మళ్లీ విద్యను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉన్నదని. బ్రాహ్మణయ్య మనవాదుల పార్టీలను ఓడించి బహుజన రాజ్యం సాధించుకుంటేనే సావిత్రిబాయి పూలే గారికి ఘనమైన నివారణ అన్నారు.. మాడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేను,పూలేను ఈ అగ్రకుల సమాజం వారి త్యాగాన్ని తెలియకుండా జాగ్రత్త పడిందని.. వారు అందరికీ విద్య కోసం పోరాడితే. ఈ దోపిడీ కులాలు ఆవిద్యాను మన నుండి దూరం చేశాయి… అందుకే అక్షరాన్ని బతికించాలంటే మనం రాజులు కావాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్, రాష్ట్రప్రధాన కార్యదర్శి కొదుమూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు భూపతి శ్రీనివాసరావు, కురుమేళ్ళ శంకర్, అధికార ప్రతినిధి తూముల శ్రీనివాసు, గౌరవ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి బండి రాజు గౌడ్, గుమలాపురం సత్యనారాయణ, రామాచారి, దిండి రామన్, మిట్టపల్లి సాంబయ్య, మహిళా నాయకులు కాసోజ్ రాజేశ్వరి, ఉమామహేశ్వరి విద్య, రేణుక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు