+91 95819 05907

బహుళ అంతస్తుల నిర్మాణాలను ఎల్ టి ఆర్ కేసు కట్టి కూల్చివేయాలి.

షెడ్యూల్డ్ ప్రాంతం చెరుకూరు, రేగులపాడు గ్రామంలో భూమి క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి పట్టించుకునే నాధుడే కరువాయే

1/70 చట్టం అమలు చేయవలసిన అధికారులు మౌనం.

ఆదివాసీల స్వయంపాలిత ప్రాంతాలలో గిరిజనేతరులకు హక్కే లేదు సార్ అయినా అన్ని అనుభవిస్తున్నారు ఎట్లా

నేటి గద్దర్ న్యూస్, వాజేడు:

ములుగు జిల్లా వాజేడు మండలం లక్ష్మీపురం గ్రామంలో తుడుందెబ్బ, జిఎస్పి, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకి రమణ, జీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చింత మోహనరావు, మాట్లాడుతూ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసిల స్వయం పాలిత ప్రాంతమైన వాజేడు మండలం చెరుకూరు, రేగులపాడు గ్రామం లో జాతీయ రహదారికి ఇరువైపులా బహుళ అంతస్తుల నిర్మాణాలు, భూ క్రయ విక్రయాలు, జోరుగా సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మౌనం పటిస్తున్నారనే ఆరోపణలు నిండుగా ఉన్నాయని వారన్నారు. ఎల్ టి ఆర్ ప్రకారం భూ బదలాయింపు జరిగితే తక్షణమే ఎల్ టి ఆర్ కేసు కట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి లేని పక్షంలో నిరుపేద భూమిలేని ఆదివాసి ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివాసి ప్రాంతాలలో మరో చట్టం మలిదశ చట్టం ఎన్నో పోరాటాల ఫలితంగా 1/70, చట్టం అమలులోకి వచ్చింది. వచ్చిన నాటి నుండి నేటి వరకు చట్టం
పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీ ప్రాంతాలలో కి వలస గిరిజనేతరులు రావడానికి కారకులైనారని, అధికారులు పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆదివాసి చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని ఒకవైపు ప్రభుత్వం మరొకవైపు అధికారులు చట్టాల విషయంలో మౌనం పటిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు స్వయంపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం విధితమే కానీ గిరిజనేతరులకు షెడ్యూల్ ప్రాంతంలో హక్కులు ఎవరిచ్చారు. గిరిజన ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడి, గిరిజన చట్టాలను ఉల్లంఘన చేస్తున్న గిరిజనేతరులపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !