+91 95819 05907

బహుళ అంతస్తుల నిర్మాణాలను ఎల్ టి ఆర్ కేసు కట్టి కూల్చివేయాలి.

షెడ్యూల్డ్ ప్రాంతం చెరుకూరు, రేగులపాడు గ్రామంలో భూమి క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి పట్టించుకునే నాధుడే కరువాయే

1/70 చట్టం అమలు చేయవలసిన అధికారులు మౌనం.

ఆదివాసీల స్వయంపాలిత ప్రాంతాలలో గిరిజనేతరులకు హక్కే లేదు సార్ అయినా అన్ని అనుభవిస్తున్నారు ఎట్లా

నేటి గద్దర్ న్యూస్, వాజేడు:

ములుగు జిల్లా వాజేడు మండలం లక్ష్మీపురం గ్రామంలో తుడుందెబ్బ, జిఎస్పి, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకి రమణ, జీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చింత మోహనరావు, మాట్లాడుతూ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసిల స్వయం పాలిత ప్రాంతమైన వాజేడు మండలం చెరుకూరు, రేగులపాడు గ్రామం లో జాతీయ రహదారికి ఇరువైపులా బహుళ అంతస్తుల నిర్మాణాలు, భూ క్రయ విక్రయాలు, జోరుగా సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మౌనం పటిస్తున్నారనే ఆరోపణలు నిండుగా ఉన్నాయని వారన్నారు. ఎల్ టి ఆర్ ప్రకారం భూ బదలాయింపు జరిగితే తక్షణమే ఎల్ టి ఆర్ కేసు కట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి లేని పక్షంలో నిరుపేద భూమిలేని ఆదివాసి ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివాసి ప్రాంతాలలో మరో చట్టం మలిదశ చట్టం ఎన్నో పోరాటాల ఫలితంగా 1/70, చట్టం అమలులోకి వచ్చింది. వచ్చిన నాటి నుండి నేటి వరకు చట్టం
పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీ ప్రాంతాలలో కి వలస గిరిజనేతరులు రావడానికి కారకులైనారని, అధికారులు పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆదివాసి చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని ఒకవైపు ప్రభుత్వం మరొకవైపు అధికారులు చట్టాల విషయంలో మౌనం పటిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు స్వయంపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం విధితమే కానీ గిరిజనేతరులకు షెడ్యూల్ ప్రాంతంలో హక్కులు ఎవరిచ్చారు. గిరిజన ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడి, గిరిజన చట్టాలను ఉల్లంఘన చేస్తున్న గిరిజనేతరులపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !