+91 95819 05907

ASWARAOPETA:బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్:నామ

2లక్షల మెజారిటీతో నామా గెలుపు ఖాయం

★యుద్దానికి BRS శ్రేణులు సిద్ధంగా ఉండాలి

★కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది

★*హోదాను మరిచిన మాట్లాడుతున్న ముఖ్యమంత్రి

★ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లా కు ఒరిగింది శూన్యం

★అశ్వారావుపేట మండలంలో BRS పార్టీ వారిని బెదిరిస్తున్నారని తెలిసింది….ఎవరు భయ పడాల్సిన అవసరం లేదు

★అధికారం కట్టబెట్టింది ప్రజలకు మేలు చేస్తారని ….బెదిరించమని కాదు

*అధికారం శాశ్వతం కాదు…*

*అశ్వారావుపేటలో BRS పార్టీ ఉన్నపుడు తెచ్చిన అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లలేని పరిస్థితి*

*త్వరలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూస్తాం*

*సమస్య వస్తే ఒక ఫోన్ చేయండి నిమిషాల్లో వస్తాం*

*భవిష్యత్తు బీ ఆర్ ఎస్ దే*

*కష్టకాలంలో తోడుగా ఉన్న వారికే భవిష్యత్తులో ప్రాధాన్యత*

*పోయే వారిని పోనివండి… వారి వల్ల మనకి ఎం నష్టం లేదు*
*ఖమ్మం BRS పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామా
★అశ్వారావుపేట మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు,తాటి

నేటి గద్దర్ న్యూస్,అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి:
2లక్షల మెజారిటీతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ BRS అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుస్తారని అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు,తాటి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. అశ్వారావుపేట మండల BRS విస్తృత సమావేశం గురువారం అశ్వారావుపేట 3వ మెయిల్ రాయి వద్ద ఉన్న ఆయిల్ ఫామ్ తోటలో మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు మాట్లాడారు.యుద్దానికి BRS శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, మోసపూరిత హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారులకు వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రజల కష్టాలు తీరుస్తారని భావించి రేవంత్ కి సీఎం పీఠం కట్టబెడితే
హోదాను మరిచిన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, తెలంగాణను అంధ పాతాళంలోకి నెట్టుతున్నారని ఆరోపించారు.
ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లా కు ఒరిగింది శూన్యం అని నామా ఎద్దేవా చేశారు.
అశ్వారావుపేట మండలంలో BRS పార్టీ వారిని బెదిరిస్తున్నారని తెలిసిందని…ఎవరు భయ పడాల్సిన అవసరం లేదు
అధికారం కట్టబెట్టింది ప్రజలకు మేలు చేస్తారని ….బెదిరించమని కాదు..అధికారం శాశ్వతం కాదు అని కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నారు.
అశ్వారావుపేటలో BRS పార్టీ ఉన్నపుడు తెచ్చిన అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లలేని దుస్థితి నెలకొందని, తక్షణమే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
త్వరలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని చూస్తాం. అశ్వరావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులకు ఏ
సమస్య వచ్చిన ఒక ఫోన్ చేయండి నిమిషాల్లో వస్తా అని ధైర్యం నూరి పోశారు.
భవిష్యత్తు బీ ఆర్ ఎస్ దే
కష్టకాలంలో తోడుగా ఉన్న వారికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని,
పోయే వారిని పోనివండి… వారి వల్ల మనకి ఎం నష్టం లేదు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని నామ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్ ,ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి ,జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి , ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి ,మాజీ జెడ్పీటీసీ జూపల్లి రమణ రావు ,వైస్ ఎంపీపీ ఫణీంద్ర , BRS నియోజకవర్గ మహిళా నాయకురాలు వగ్గెల పూజా ,ఎంపీటీసీలు,గారపాటి సూర్య ,మాజీ సర్పంచ్ లు నారాం రాజ్ శేకర్,జ్యోత్స్న బాయ్ ,తాడేపల్లి రవి ,మోహన్ రెడ్డి , చిన్నంశేట్టి నరసింహం , sకాసాని చంద్ర మోహన్ ,తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

 Don't Miss this News !