రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలతో మోసపూరితమైన మాటలతో మరో సారి దేశ ప్రజలను మోసం చేసే యత్నం
★Congress పార్టీతెలంగాణ రాష్ట్రం లో 13 గ్యారంటీలను అమలు చేశాకే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగాలి
★రైతులకు రెండు లక్షల ఋణమాఫీ ఎందుకు చెయ్యలే
★మహబుబాబాద్ జిల్లా BJP మహిళ మోర్చ అధ్యక్షురాలు గుండెబోయిన నాగమణి
నేటి గద్దర్ వెబ్ డెస్క్ :AICC నాయకులు రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలతో మోసపూరితమైన మాటలను మరో సారి దేశ ప్రజలను మోసం చేసే యత్నం చేశారని మహబుబాబాద్ జిల్లా BJP మహిళ మోర్చ అధ్యక్షురాలు గుండెబోయిన నాగమణి ఆరోపించారు.
గార్ల మండలం సీతంపేట గ్రామంలో BJP కార్యకర్తల సమావేశం శనివారం బూత్ అధ్యక్షులు పూనెం రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి మహబూబాబాద్ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు గుండెబోయిన నాగమణి మాట్లాడుతూ…తుక్క గూడ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో …కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ పచ్చి మోసపూరితమైన వాగ్దానాలను సభ సాక్షిగా చెప్పటం జరిగింది.కాంగ్రెస్ పార్టీ సభ వేధికలపైన చెప్పె దానికి …వారి ఆచరణకు పోంతన లేదని చెప్పటం జరిగింది. రాహూల్ గాందీ చెప్పినట్లు దేశంలో 90% బడుగు బహిన వర్ఢాల ప్రజల ఉన్న విషయం నిజమే కాని కాంగ్రెస్ పార్టీ బడుగు బహిన వర్ఢాల ప్రజల రాజ్యాధికారం కోసం చేసింది మాత్రం శున్యం.బడుగు బలహిన వర్గాల పేరుతో రాజ్యాధికారం అనుభవిస్తున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ,SC ,ST రిజర్వేషన్ స్థానాలు 38 పోవంగా మిగిలిన 81 స్థానాల్లో 42 స్థానాలను అంటే 52% సిట్లను ఒక్క CM రెవంత్ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి,16% మాత్రమే బిసి బడుగు బహిన వర్ఢాల ప్రజలకు MLA సిట్లు ఇచ్చిన రాహుల్ గాంధీ… ఎందుకు 90% ఉన్న బిసి బడుగు బహిన వర్ఢాల ప్రజలకు 90% సిట్లు ఇవ్వలేదని విమర్శించారు .అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల క్రితం ప్రకటించిన 38 కార్పోరేషన్ చైర్మన్ పదవులలో ఒక్క CM రెవంత్ రెడ్డి సామాజిక వర్గానికే 13 చైర్మన్ లను ఎలా రాహుల్ గాంధీ ఇచ్చారని , 90% ఉన్న బిసి బడుగు బహిన వర్ఢాల ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని మరియు అతి త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో….17 MP స్థానాల్లో SC- 3 ,ST – 2 , ముస్లిం – 1 మొత్తం 6 స్థానాలు పోవంగా మిగిలిన 11 MP స్థానాలలో..6 MP స్థానాలు ఒక్క CM రెవంత్ రెడ్డి సామాజిక వర్గానికి ఎలా రాహుల్ గాంధీ ఇచ్చారు ? 90% ఉన్న SC,ST BC,మైనార్టీ లకు ఎందుకు 90% సిట్లు,పదవులు ఇవ్వలేదని రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రులు అనేక వేదికలపైనా మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటిలను అమలు చేస్తున్నాం అని పచ్చి అబద్ధాలు చెప్పుతున్నారు .6 గ్యారంటీలలో మొత్తు 13 గ్యారంటీలు ఉన్నయాని వారు మర్చి పోరయాని, వారు ఇచ్చిన 13 గ్యారంటీలను అమలు చేశాకే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగాలని రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఆమే డిమాండ్ చేశారు.60 యేళ్ళు దేశాని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు గిట్టుబాటు ధరకు చట్టం చేయాలేదు, ఎందుకు మహిళ రిజర్వేషన్ బిల్లు చట్టం చేయొలేదు, ఎందుకు రైతు సంక్షేమం కోసం విధివిధానాలు రూపోందిచ లేదు అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు 120 రోజులు దాటిన ఎందు రైతులకు రెండు లక్షల ఋణమాఫీ చేయలేదని ,వృద్దులకు, వితంతువులకు 4000/ పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదని ,అలాగే ప్రతి గృహిణికి నెలకు 2500/ ఎందుకు ఇవ్వటం లేదని కాంగ్రెస్ పార్టీని , రాహుల్ గాంధీ ప్రశ్నించారు . బిజెపి పార్టీ అంటేనే బిసి SC,ST , BC మరియు బడుగు బహిన వర్గాల అభ్యున్నతి పార్టీ అని, మోడి నాయకత్వంలో మారో సారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని , చెప్పటం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 గెలిచిన 17 MP లు గెలిచిన ఒరిగేది ఏమీ ఉండదని , త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి ప్రోపెసర్ సీతారామ్ నాయక్ ను గెలిపించి మహబూబాబాద్ పార్లమెంటు అభివృద్ధికి దోహదపడలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ST మోర్చ ఉపాధ్యక్షులు ఆజ్మిర రాము,గార్ల మండల బిజెపి అధ్యక్షులు జంపాల శ్రీను ,మండల ఉపాధ్యక్షులు.యాడ్ల రాజశేఖర్ , మండల కార్యదర్శి భూక్య వెంకన్న , పూనెం రాంబాబు,వీర్యా ,తదితరులు పాల్గొన్నారు.
