★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు
నేటి గద్ధర్ న్యూస్ ,కరకగూడెం :
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకొని కరకగూడెం మండల ప్రధాన సెంటర్ నందు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి
brs పార్టీ sc సెల్ అధ్యక్షులు నిట్ట ఏడుకొండలు ఆధ్వర్యంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పూలమాలవేసి నివాళులర్పించారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా రేగా మాట్లాడుతూ వారిని స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలు దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలను తీసుకువచ్చి దళితుల సాధికారతకు పాటుపడిందని, దళిత బంధుతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని అన్నారు.
భారతదేశంలో అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.
వారి కీర్తికి గుర్తింపుగా హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి గౌరవిస్తుందన్నారు. అంబేద్కర్ ఒక జాతికి చెందిన వ్యక్తి కాదని అన్ని వర్గాల ఆరాధ్య దైవమన్నరు. వారు రూపొందించిన రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నామని అన్నారు. వారి చూపిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలు పని చేసిందన్నారు .ఈ కార్యక్రమంలో Brs పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఆళ్లపల్లి మండల అధ్యక్షులు పాయం నరసింహారావు జాడి నాగరాజు చిట్టీమల్ల ప్రవీణ్ రమటెంకి పూర్ణచేంద్రశేఖర్ దాసరి సంబయ్య ఎలాగొండ శ్రీనివాస్ గందర్ల సతీష్ గుర్రం లాలు సాధనపల్లి లష్మినారాయణ మెంతిని రామకృష్ణ నిట్ట రమేష్ ముత్యాల శివ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.