◆కేసీఆర్ వైపే తెలంగాణ ప్రజలు
◆ప్రజలు మరోసారి మోసపోవద్దు
◆ గెలుపు మనదే
◆బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితని గెలిపించాలి*
◆పినపాక నియోజకవర్గ స్థాయి సన్నహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ రేగా కాంతారావు,మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత
*మెండుగా ప్రజలా ఆశీస్సులు ఉన్నాయి:మాలోత్ కవిత
నేటి గద్దర్ న్యూస్, పినపాక నియోజకవర్గ ప్రతినిధి:
✍️బట్టా భిక్షపతి
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను నమ్మి మోసపోయిన ప్రజలు,మరోసారి ఆ తప్పు చేయవద్దని,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత ని గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ రేగా కాంతారావు కోరారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ స్థాయి సన్నిహక సమావేశాల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పార్టీ అభ్యర్థి కవిత,రేగా ముఖ్య అతిథిగా ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
మొదటి నుంచీ మహబూబాబాద్ బీఆర్ఎస్ గడ్డ అని,కష్టపడితే గెలుపు మనదే అన్నారు.









