+91 95819 05907

flash…flash..ITC పేపర్ మిల్లులో కార్మికుడు మృతి..?

– విషయం బయటకు రాకుండా మంతనాలు జరుగుతున్నాయా..?
– గుట్టు చప్పుడు కాకుండా బాడీని బయటకు పంపించారా..?

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 24, భద్రాద్రి కొత్తగూడెం :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ఐటిసి పేపర్ మిల్లులో డ్యూటీ కి వెళ్ళిన ఒక కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులతో కంపెనీకి సంబంధించిన వ్యక్తులు విషయం బయటకు రాకుండా మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కార్మికుడు మంగళవారం మృతి చెందగా… ఇప్పటివరకు బయటకు సమాచారం రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా మృతుడి పార్థివ దేహాన్ని బయటకు పంపించినట్లు వినికిడి. పేపర్ మిల్లులో జరుగుతున్న ఇటువంటి సంఘటనలు బయటకు రాకుండా మంతనాలు జరుపుతూ… తమకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొన్ని పార్టీలకు చెందిన వారిని తమ మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. మధ్యవర్తులుగా వ్యవహరించేవారు కంపెనీకి న్యాయం చేయడానికి వస్తున్నారా..? కార్మికులకు న్యాయం చేయడానికి వస్తున్నారా..? అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని కార్మికుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. కార్మికుడు మృతి నిన్న జరిగినప్పటికీ నేటి వరకు కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బయటకు తెలియకుండా కంపెనీ లోపల ఇంకెన్ని జరుగుతున్నాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !