+91 95819 05907

గిరిజన రైతులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి : ITDA PO

– ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 24, భద్రాద్రి కొత్తగూడెం (BHADRACHALAM):
ఆదివాసి గిరిజన రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారస్తులు అధిక శాతం వడ్డీతో పంటలకు పెట్టుబడి పెట్టి పంట చేతికి రాగానే వారు నిర్ధారించిన రేటుకి పండించిన పంట తీసుకోవడంతో రైతులు మోసపోతున్నారని, ఈ మధ్య దళారుల భారీ నుండి గిరిజన రైతులను ఆదుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో పినపాక, మణుగూరు తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఐకెపి సిబ్బందితో గిరిజన రైతులకు ఆర్థిక వెసులు బాటు కల్పించి, వారిని వడ్డీ వ్యాపారస్తుల కబంధహస్తాలలో, మధ్య దళారుల ఉచ్చులో పడకుండా కాపాడాలన్నారు. మహిళా సమైక్యల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం వర్షాలు పడగానే గిరిజన రైతులు దుక్కి దున్నుకొని పంటలు వేయడానికి సన్నద్ధమవుతారని అందుకు సంబంధిత ఐకెపి ఏపీఎంలు, సీసీలు మండల సమైక్య సభ్యులు గిరిజన రైతులకు వివో ద్వారా అవగాహన కల్పించాలన్నారు. తక్కువ వడ్డీతో వారికి ఆర్థిక సహాయం చేసి తిరిగి గిరిజన రైతుల నుండి వసూలు చేసుకునేలా రైతులకు నచ్చ చెప్పాలని ఆయన అన్నారు. మణుగూరు, పినపాక మండలాల్లోని గిరిజన రైతులకు తప్పనిసరిగా సంబంధిత ఐకెపి సిబ్బంది ప్రత్యేక బాధ్యత తీసుకొని వారికి ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలని అన్నారు. గిరిజన రైతులు మాత్రం ప్రైవేటు ఫైనాన్సులు, వడ్డీ వ్యాపారులు, మధ్య దళారులు బారిన పడకుండా చూడాలని గిరిజన గ్రామాలలో మహిళా సమైక్యలకు సంబంధించిన వివోలు గిరిజన రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. గ్రామాలలో రైతు వేదికలు అందుబాటులో ఉన్న చోట గిరిజన రైతులను ఒక దగ్గర సమావేశపరచి వారికి ఎంత డబ్బు అవసరమో అంత వారికి ఇప్పించి పంటలు పండించుకునేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఖమ్మం డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని విజయలక్ష్మి, సురేష్ బాబు, ఏటీడీఓ నరసింహారావు, మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, పినపాక తాసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !