+91 95819 05907

గిరిజన రైతులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి : ITDA PO

– ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 24, భద్రాద్రి కొత్తగూడెం (BHADRACHALAM):
ఆదివాసి గిరిజన రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారస్తులు అధిక శాతం వడ్డీతో పంటలకు పెట్టుబడి పెట్టి పంట చేతికి రాగానే వారు నిర్ధారించిన రేటుకి పండించిన పంట తీసుకోవడంతో రైతులు మోసపోతున్నారని, ఈ మధ్య దళారుల భారీ నుండి గిరిజన రైతులను ఆదుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో పినపాక, మణుగూరు తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఐకెపి సిబ్బందితో గిరిజన రైతులకు ఆర్థిక వెసులు బాటు కల్పించి, వారిని వడ్డీ వ్యాపారస్తుల కబంధహస్తాలలో, మధ్య దళారుల ఉచ్చులో పడకుండా కాపాడాలన్నారు. మహిళా సమైక్యల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం వర్షాలు పడగానే గిరిజన రైతులు దుక్కి దున్నుకొని పంటలు వేయడానికి సన్నద్ధమవుతారని అందుకు సంబంధిత ఐకెపి ఏపీఎంలు, సీసీలు మండల సమైక్య సభ్యులు గిరిజన రైతులకు వివో ద్వారా అవగాహన కల్పించాలన్నారు. తక్కువ వడ్డీతో వారికి ఆర్థిక సహాయం చేసి తిరిగి గిరిజన రైతుల నుండి వసూలు చేసుకునేలా రైతులకు నచ్చ చెప్పాలని ఆయన అన్నారు. మణుగూరు, పినపాక మండలాల్లోని గిరిజన రైతులకు తప్పనిసరిగా సంబంధిత ఐకెపి సిబ్బంది ప్రత్యేక బాధ్యత తీసుకొని వారికి ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలని అన్నారు. గిరిజన రైతులు మాత్రం ప్రైవేటు ఫైనాన్సులు, వడ్డీ వ్యాపారులు, మధ్య దళారులు బారిన పడకుండా చూడాలని గిరిజన గ్రామాలలో మహిళా సమైక్యలకు సంబంధించిన వివోలు గిరిజన రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. గ్రామాలలో రైతు వేదికలు అందుబాటులో ఉన్న చోట గిరిజన రైతులను ఒక దగ్గర సమావేశపరచి వారికి ఎంత డబ్బు అవసరమో అంత వారికి ఇప్పించి పంటలు పండించుకునేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఖమ్మం డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని విజయలక్ష్మి, సురేష్ బాబు, ఏటీడీఓ నరసింహారావు, మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, పినపాక తాసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం

Read More »

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

 Don't Miss this News !