+91 95819 05907

HYD:అదే రోజు నా Mla పదవికి రాజీనామా ఆమోదించండి: మాజీ మంత్రి హరీష్ రావు

★ అమరవీరుల సాక్షిగా శాసనసభ స్పీకర్ కు రాజీనామా లేఖను పంపించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
నేటి గద్ధర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతందానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలుపుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి కి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. సీఎం సవాల్ కి అంగీకరించిన ఆయన శుక్రవారం హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం కి ప్రతి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోగా ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతులకు ప్రజలకు మేలు జరగాలని సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు 15 వరకు డెడ్లైన్ విధిస్తున్నానని.. అప్పటివరకు ప్రజల హామీలు నెరవేస్తే తను రాజీనామా చేసినట్టేనని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ కు హామీలు అమలు అయితే తన రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ లేఖను పంపించారు.

★మాజీ మంత్రి హరీష్ రావు లేఖలో పేర్కొన్న డిమాండ్లు ఇవే★👇
2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9నాడు రైతులకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు దాటినా మహాలక్ష్మి పేరిట ప్రతి నెలకు 18 యేండ్లు దాటిన వారందరికీ రూ. 2500 చొప్పున ఇస్తామన్న హామీ నేర వేర లేదు రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ 15 పదిహేను వేల రూపాయల చొప్పున ,రైతు కూలీలకు ఏటా 12 వేల రూపాయల చొప్పున చెల్లించడం, పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లించడమనే హామీలు నెరవేరలేదు. ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలివ్వడం, ఉద్యమ కారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వడం ఆచరణకు నోచుకోలేదు యువ వికాసం కింది 5 లక్షల రూపాయల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తామని ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !