+91 95819 05907

HYD:అదే రోజు నా Mla పదవికి రాజీనామా ఆమోదించండి: మాజీ మంత్రి హరీష్ రావు

★ అమరవీరుల సాక్షిగా శాసనసభ స్పీకర్ కు రాజీనామా లేఖను పంపించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
నేటి గద్ధర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతందానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలుపుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి కి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. సీఎం సవాల్ కి అంగీకరించిన ఆయన శుక్రవారం హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం కి ప్రతి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోగా ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతులకు ప్రజలకు మేలు జరగాలని సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు 15 వరకు డెడ్లైన్ విధిస్తున్నానని.. అప్పటివరకు ప్రజల హామీలు నెరవేస్తే తను రాజీనామా చేసినట్టేనని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ కు హామీలు అమలు అయితే తన రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ లేఖను పంపించారు.

★మాజీ మంత్రి హరీష్ రావు లేఖలో పేర్కొన్న డిమాండ్లు ఇవే★👇
2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9నాడు రైతులకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు దాటినా మహాలక్ష్మి పేరిట ప్రతి నెలకు 18 యేండ్లు దాటిన వారందరికీ రూ. 2500 చొప్పున ఇస్తామన్న హామీ నేర వేర లేదు రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ 15 పదిహేను వేల రూపాయల చొప్పున ,రైతు కూలీలకు ఏటా 12 వేల రూపాయల చొప్పున చెల్లించడం, పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లించడమనే హామీలు నెరవేరలేదు. ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలివ్వడం, ఉద్యమ కారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వడం ఆచరణకు నోచుకోలేదు యువ వికాసం కింది 5 లక్షల రూపాయల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తామని ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !