+91 95819 05907

HYD:అదే రోజు నా Mla పదవికి రాజీనామా ఆమోదించండి: మాజీ మంత్రి హరీష్ రావు

★ అమరవీరుల సాక్షిగా శాసనసభ స్పీకర్ కు రాజీనామా లేఖను పంపించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
నేటి గద్ధర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతందానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలుపుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి కి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. సీఎం సవాల్ కి అంగీకరించిన ఆయన శుక్రవారం హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం కి ప్రతి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోగా ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతులకు ప్రజలకు మేలు జరగాలని సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు 15 వరకు డెడ్లైన్ విధిస్తున్నానని.. అప్పటివరకు ప్రజల హామీలు నెరవేస్తే తను రాజీనామా చేసినట్టేనని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ కు హామీలు అమలు అయితే తన రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ లేఖను పంపించారు.

★మాజీ మంత్రి హరీష్ రావు లేఖలో పేర్కొన్న డిమాండ్లు ఇవే★👇
2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9నాడు రైతులకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు దాటినా మహాలక్ష్మి పేరిట ప్రతి నెలకు 18 యేండ్లు దాటిన వారందరికీ రూ. 2500 చొప్పున ఇస్తామన్న హామీ నేర వేర లేదు రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ 15 పదిహేను వేల రూపాయల చొప్పున ,రైతు కూలీలకు ఏటా 12 వేల రూపాయల చొప్పున చెల్లించడం, పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లించడమనే హామీలు నెరవేరలేదు. ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలివ్వడం, ఉద్యమ కారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వడం ఆచరణకు నోచుకోలేదు యువ వికాసం కింది 5 లక్షల రూపాయల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తామని ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !