+91 95819 05907

ఏజెన్సీలోని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :

ఏజెన్సీలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాచలం ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం నాడు తన చాంబర్లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి అత్యుత్తమ ర్యాంకులతో ఐఐటీలో సీటు పొందడానికి అర్హత సాధించిన విద్యార్థినిలకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లను ఆయన అభినందించారు. సాహితి 5756 ర్యాంకు, నిహారిక 9722 ర్యాంకులు సాధించి భద్రాచలం ఖ్యాతిని పెంచారని ఆయన అన్నారు. ఏజెన్సీలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ విద్యార్థినిలను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థిని, విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాసై ఎంట్రెన్స్ రాసి ఐఐటి లలో సీటు సంపాదించి, కాలేజీకి, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన అన్నారు. ఏజెన్సీలో విద్యాభివృద్ధి కోసం ఐటీడీఏ అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాగంటి రమేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఎండి.బషీర్, విద్యార్థినీలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

 Don't Miss this News !