+91 95819 05907

flash..💥💥.flash💥💥మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టాలి

– అనుమతి పొందిన వాహనాలనే ప్రచారంలో ఉపయోగించాలి
– ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ గోపాల్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :

ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అక్రమ మద్యం, డబ్బు రవాణాను అరికట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ గోపాల్ అన్నారు. శుక్రవారం భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు చెక్ పోస్ట్ లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెక్ పోస్ట్ ల వద్ద పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని చెక్ చేయాలని, ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం, డబ్బు, ఇతర బహుమతులను తరలించకుండా అరికట్టాలని అధికారులకు సూచించారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటి నుండి పోలింగ్ జరిగే వరకు ప్రతి రూపాయి ఖర్చును వ్యయ పరిశీలకుల బృందాలు పకడ్బందీగా నమోదు చేయాలని, అన్ని బృందాలు సమన్వయంతో పనిచేయాలని డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకుండా ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు జరిగినప్పుడు తప్పనిసరిగా ముందుగా అనుమతి పొందిన వాహనాలను ప్రచారంలో ఉపయోగించాలని, ఎవరైతే అనుమతి తీసుకోకుండా ప్రచార వాహనాలు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తే ఈసీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయించిన ధర ప్రకారము ఖర్చు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆఫీసర్ వేల్పుల శ్రీనివాసరావు, లైజనింగ్ ఆఫీసర్ పృధ్విరాజ్, సిఐ సంజీవరావు, ఎఫ్ఎస్టి బృందం అధికారి మధు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 6

Read More »

 Don't Miss this News !