+91 95819 05907

flash..💥💥.flash💥💥మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టాలి

– అనుమతి పొందిన వాహనాలనే ప్రచారంలో ఉపయోగించాలి
– ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ గోపాల్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :

ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అక్రమ మద్యం, డబ్బు రవాణాను అరికట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ గోపాల్ అన్నారు. శుక్రవారం భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు చెక్ పోస్ట్ లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెక్ పోస్ట్ ల వద్ద పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని చెక్ చేయాలని, ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం, డబ్బు, ఇతర బహుమతులను తరలించకుండా అరికట్టాలని అధికారులకు సూచించారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటి నుండి పోలింగ్ జరిగే వరకు ప్రతి రూపాయి ఖర్చును వ్యయ పరిశీలకుల బృందాలు పకడ్బందీగా నమోదు చేయాలని, అన్ని బృందాలు సమన్వయంతో పనిచేయాలని డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకుండా ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు జరిగినప్పుడు తప్పనిసరిగా ముందుగా అనుమతి పొందిన వాహనాలను ప్రచారంలో ఉపయోగించాలని, ఎవరైతే అనుమతి తీసుకోకుండా ప్రచార వాహనాలు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తే ఈసీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయించిన ధర ప్రకారము ఖర్చు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆఫీసర్ వేల్పుల శ్రీనివాసరావు, లైజనింగ్ ఆఫీసర్ పృధ్విరాజ్, సిఐ సంజీవరావు, ఎఫ్ఎస్టి బృందం అధికారి మధు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

చలో వరంగల్, సైకిల్ పై ప్రచార యాత్ర నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: ఈనెల 27 న వరంగల్ లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ, ను జయప్రదం చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించిన భద్రాద్రి

Read More »

ఈనెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది

. గజ్వేల్ మండల్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఎల్లం. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 24. వరంగల్ లో ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే రజోత్సవ

Read More »

 Don't Miss this News !