+91 95819 05907

తెలంగాణ సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షలో ఆ పాఠశాల విద్యార్థి ఎంపిక

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (పినపాక)మే 7:
దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో 6,9 వ తరగతుల్లో ప్రవేశాలకు జనవరి 28న ఆఫ్ లైన్ విధానంలో ఎన్టీఏ AISSEE -2024 ప్రవేశ పరీక్ష నిర్వహించింది.గురువారం విడుదల చేసిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ లో గల ఎక్సలెంట్ బాషా హై స్కూల్ విద్యార్థి సైనిక్ స్కూల్ లో సీట్ సాధించడం గొప్ప విషయం అని పాఠశాల డైరెక్టర్ బండారు నరేంద్ర,ప్రిన్సిపాల్ అంకం సురేష్ అన్నారు.జానంపేట గ్రామానికి చెందిన రామటెంకి గౌషిక్ తేజ్ 5వ ఎక్సలెంట్ బాషా హై స్కూల్ లో 5వ తరగతి చదువుతూ సైనిక్ స్కూల్ లో సీట్ సాధించడం పట్ల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని ఎక్సలెంట్ భాష హై స్కూల్ యాజమాన్యం తో పంచుకున్నారు. ఉపాధ్యాయుల కృషితో,బట్టి విధానం కాకుండా,అర్థం చేసుకొని అవగాహన చేసుకునే విధంగా పాఠాలు చెప్తారని గౌశిక్ తేజ్ తల్లిదండ్రులు అన్నారు.ఈ సందర్బంగా ఎక్సలెంట్ స్కూల్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ,ఏజెన్సీ ప్రాంతం లో బట్టీ చదువుకు స్వస్తి చెప్తూ మొన్న పదవ తరగతి ఫలితాలలో 10/10 7గురు విద్యార్థులు సాధించారని,గౌషిక్ తేజ్ ఉపాధ్యాయులు చెప్పింది చాలా శ్రద్దగా వింటాడని, క్రమశిక్షణతో అన్నింట్లో చాలా చురుకుగా ఉంటాడని అన్నారు.ఎక్సలెంట్ బాషా హై స్కూల్ యాజమాన్యం విద్యార్థిని శాలువా తో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎక్సెలెంట్ స్కూల్ గ్రూప్ అఫ్ చైర్మన్ యూసుఫ్ షరీఫ్,కరస్పాండెంట్ ఖాదర్,డైరెక్టర్స్ యాకుబ్ షరీఫ్, ముక్కు వెంకట నర్సారెడ్డి, బండారు నరేంద్ర,ప్రిన్సిపాల్ అంకం సురేష్,విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !