+91 95819 05907

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:కాంగ్రెస్

– ఉపాధి పనులు తెచ్చిందే కాంగ్రెస్
– బలరాం నాయక్ గెలుపు తథ్యం
– నాగినేని ప్రోలు, రెడ్డిపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గద్దర్, మే 9, భద్రాద్రి కొత్తగూడెం :

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే కులమత ప్రాంతాలకు అతీతంగా బలరామన్నను గెలిపించుకోవాలని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా గురువారం నాగినేని ప్రోలు గ్రామంలోని ఉపాధి కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వారికి అల్పాహారం అందించారు. వారితోపాటు కొద్దిసేపు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ఎడమ కంటి పిచ్చిరెడ్డి, మాదినేని వెంకటేశ్వరరావు(ఎర్రబాబు) తదితర నాయకులు మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డ అని మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు గ్యారెంటీలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, వంటి పథకాలు ఇప్పటికే అమలు చేస్తూ రైతులకు రుణమాఫీ, రైతుబంధు, రైతు భరోసా కింద నిధులు మంజూరు చేయనున్నారని వారు పేర్కొన్నారు. పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఐటిడిఏ లను, బొగ్గు గనులను, ఉక్కు పరిశ్రమలను తదితర పరిశ్రమలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గతంలో కేంద్రమంత్రిగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతానికి 2000 కోట్ల రూపాయలు నిధులను తీసుకువచ్చిన వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటేనే ప్రజలకు ప్రజాస్వామ్యం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడమ కంటి రోసి రెడ్డి, గాద వెంకటేశ్వర రెడ్డి, యువజన నాయకులు ఎడమ కంటి సుధాకర్ రెడ్డి, దుగ్గెంపూడి శేశిరెడ్డి, పాలెం లక్ష్మారెడ్డి, బానోత్ రాందాస్, కాటం వెంకట్ రెడ్డి, ఏరువా వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

 Don't Miss this News !