+91 95819 05907

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:కాంగ్రెస్

– ఉపాధి పనులు తెచ్చిందే కాంగ్రెస్
– బలరాం నాయక్ గెలుపు తథ్యం
– నాగినేని ప్రోలు, రెడ్డిపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గద్దర్, మే 9, భద్రాద్రి కొత్తగూడెం :

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే కులమత ప్రాంతాలకు అతీతంగా బలరామన్నను గెలిపించుకోవాలని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా గురువారం నాగినేని ప్రోలు గ్రామంలోని ఉపాధి కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వారికి అల్పాహారం అందించారు. వారితోపాటు కొద్దిసేపు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ఎడమ కంటి పిచ్చిరెడ్డి, మాదినేని వెంకటేశ్వరరావు(ఎర్రబాబు) తదితర నాయకులు మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డ అని మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు గ్యారెంటీలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, వంటి పథకాలు ఇప్పటికే అమలు చేస్తూ రైతులకు రుణమాఫీ, రైతుబంధు, రైతు భరోసా కింద నిధులు మంజూరు చేయనున్నారని వారు పేర్కొన్నారు. పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఐటిడిఏ లను, బొగ్గు గనులను, ఉక్కు పరిశ్రమలను తదితర పరిశ్రమలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గతంలో కేంద్రమంత్రిగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతానికి 2000 కోట్ల రూపాయలు నిధులను తీసుకువచ్చిన వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటేనే ప్రజలకు ప్రజాస్వామ్యం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడమ కంటి రోసి రెడ్డి, గాద వెంకటేశ్వర రెడ్డి, యువజన నాయకులు ఎడమ కంటి సుధాకర్ రెడ్డి, దుగ్గెంపూడి శేశిరెడ్డి, పాలెం లక్ష్మారెడ్డి, బానోత్ రాందాస్, కాటం వెంకట్ రెడ్డి, ఏరువా వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పినపాకలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు .

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా జరిగాయి. పినపాక మండల తెలుగు దేశం పార్టీ

Read More »

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు. మహదేవపురం ఎత్తిపోతల పథకం – సాగునీటి సరఫరాలో చరిత్రాత్మక ముందడుగు ఖమ్మం జిల్లా,మధిర మండలం,

Read More »

మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

. బునియది ఆదివాసి, కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

Read More »

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం

Read More »

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

 Don't Miss this News !