+91 95819 05907

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:కాంగ్రెస్

– ఉపాధి పనులు తెచ్చిందే కాంగ్రెస్
– బలరాం నాయక్ గెలుపు తథ్యం
– నాగినేని ప్రోలు, రెడ్డిపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గద్దర్, మే 9, భద్రాద్రి కొత్తగూడెం :

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే కులమత ప్రాంతాలకు అతీతంగా బలరామన్నను గెలిపించుకోవాలని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా గురువారం నాగినేని ప్రోలు గ్రామంలోని ఉపాధి కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వారికి అల్పాహారం అందించారు. వారితోపాటు కొద్దిసేపు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ఎడమ కంటి పిచ్చిరెడ్డి, మాదినేని వెంకటేశ్వరరావు(ఎర్రబాబు) తదితర నాయకులు మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డ అని మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు గ్యారెంటీలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, వంటి పథకాలు ఇప్పటికే అమలు చేస్తూ రైతులకు రుణమాఫీ, రైతుబంధు, రైతు భరోసా కింద నిధులు మంజూరు చేయనున్నారని వారు పేర్కొన్నారు. పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఐటిడిఏ లను, బొగ్గు గనులను, ఉక్కు పరిశ్రమలను తదితర పరిశ్రమలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గతంలో కేంద్రమంత్రిగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతానికి 2000 కోట్ల రూపాయలు నిధులను తీసుకువచ్చిన వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటేనే ప్రజలకు ప్రజాస్వామ్యం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడమ కంటి రోసి రెడ్డి, గాద వెంకటేశ్వర రెడ్డి, యువజన నాయకులు ఎడమ కంటి సుధాకర్ రెడ్డి, దుగ్గెంపూడి శేశిరెడ్డి, పాలెం లక్ష్మారెడ్డి, బానోత్ రాందాస్, కాటం వెంకట్ రెడ్డి, ఏరువా వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !