+91 95819 05907

మంత్రి మాటలను పట్టించుకోవడం లేదు:వరికి ఎరగడ పెట్టారు…పక్కనున్న పామాయిల్ తోట కి అంటుకుంది

★ పామాయిల్ తోట అగ్నికి ఆహుతి
★ డ్రిప్పింగ్ పైపులు సైతం పూర్తిగా దగ్ధం
★రూ లక్షల్లో నష్టం
★వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని ప్రకటించిన మంత్రి తుమ్మల
★రెండవ రోజే ఈ ఘటన
★ప్రభుత్వం ఆదుకోవాలి: బాధిత రైతులు

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(పినపాక):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో పామాయిల్ మొక్కలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధిత రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లింది.బాధిత రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాండ్ల అశోక్ ఎకరం 50 సెంట్లు, చిత్తలూరి సత్యం రెండు ఎకరాల 50 సెంట్లు, గాండ్ల విజయ్ ఎకరం 50 సెంట్ల లో గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో పామాయిల్ పంట సాగు చేశారు . బాధిత రైతులు ఎంతో శ్రమకు వచ్చి పామాయిల్ మొక్కలు ఏపుగా రావడానికి నిరంతరం శ్రమించారు. వారి కష్టానికి ఫలితంగా మొక్కలు ఏపుగా పెరగడం జరిగింది. కానీ వారి ఆశలను ఓ రైతు తన పొలంలోని వరి కొయ్యలను కాల్చడానికి. గురువారం పెట్టిన ఎరగడ పామాయిల్ రైతులకు శాపంగా మారింది.ఎరగడ మంటలు పామాయిల్ తోటకు వ్యాప్తి చెందడంతో తోటలోని మొక్కలు డ్రిప్పింగ్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనితో ఆయా రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లింది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని ప్రకటించిన మరునాడు ఈ సంఘటన జరగడం కొసమెరుపు. కాగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరడమైనది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !