+91 95819 05907

సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూను నివారిద్దాం!

– మండల ప్రాధమిక వైద్యాధికారి డా. స్రవంతి

నేటి గదర్, మే 16, బోనకల్ :

సమాజ భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అని బోనకల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. స్రవంతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ నివారణ, అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని ప్రజలందరి భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం! అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని అన్నారు. డెంగ్యూ వ్యాధి రాకుండా దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని సూచించారు. దోమల వల్ల వచ్చే డెంగీ మనిషిలో అభివృద్ధి చెందే విధానం, వ్యాప్తి, జాగ్రత్తలను గురించి వివరించారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల డెంగ్యూ వ్యాపిస్తుందని, ఇది వర్షాకాలంలో విజృంభిస్తోందన్నారు. రానున్న వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఆరోగ్య పర్యవేక్షకులు దానయ్య, స్వర్ణమార్త, స్టాఫ్ నర్స్ భవాని, రమ, ఏఎన్ఎం సరస్వతి, ల్యాబ్ అసిస్టెంట్ యాకుబ్, ఆశా కార్యకర్తలు ఎం లీలా కుమారి, దుర్గా, గంగుల విజయలక్ష్మి, గద్దె తులసి, కుమారి, పద్మ, కృపారాణి, ఉష, జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

 Don't Miss this News !