+91 95819 05907

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన C M రేవంత్ రెడ్డి:KTR

★ రెండు లక్షల జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ ది

★ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించావు

★ ప్రజలు మార్పు కోరుకున్నారు.. గోసపడుతున్నారు

★ఒక్కసారి మోసపోవడం తప్పు మళ్లీ తెలిసే మోసపోతే భవిష్యత్ తరాలు గోసపడతాయి
★ నిరుద్యోగులకుCM రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు అయ్యాయా?
★ గ్రాడ్యుయేట్ సోదరులు రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

★ భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:అబద్ధపు,మోసపూరిత హామీలతో CM రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగిందని బీ ఆర్ ఏస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో సోమవారం నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విజయం కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మాజీ సీఎం KCR దిశా నిర్దేశంతో పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం అద్భుత పురోగతి సాధించిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల,2లక్షల ఉద్యోగాలు, 11వేల పైచిలుకు కాంట్రాక్ట్ బేసి ఉద్యోగాలను పర్మినెంట్ చేసిన ఘనత KCR కే దక్కిందన్నారు. మెగా DSC, నిరుద్యోగ భృతి, కాంగ్రెస్ జాబ్ ఇవ్వాలి అండి ఎక్కడ అని ప్రశ్నించారు.ప్రజలు మార్పు కోరుకున్నారు.. గోసపడుతున్నారు.ఒక్కసారి మోసపోవడం తప్పు కాదు.. మళ్లీ తెలిసే మోసపోతే మన తప్పిదం అవుతుందని అన్నారు. అప్పుడు వ్యక్తికి ఓటు వేస్తే భవిష్యత్ తరాలు గోసపడతాయి అని అన్నారు. మాయ మాటల తీన్మార్ మల్లన్న కి ఓటు వేస్తే వ్యర్థం అన్నారు.విద్యావంతుడు, ప్రజల గొంతుక,సౌమ్యుడు BRS అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి పట్టాభద్రులు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాజ్యసభ MP వద్ధి రాజు రవిచంద్ర,ఆ.డా. RS ప్రవీణ్ కుమార్, BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ,మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి,మాజీ గ్రంథాలయం చైర్మన్ దిండిగాల రాజేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRSఅధికార ప్రతినిధులు కోలేటి భవాని శంకర్, లకావత్ గిరిబాబు,వనామా రాఘవ ,బీ ఆర్ ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !