+91 95819 05907

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన C M రేవంత్ రెడ్డి:KTR

★ రెండు లక్షల జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ ది

★ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించావు

★ ప్రజలు మార్పు కోరుకున్నారు.. గోసపడుతున్నారు

★ఒక్కసారి మోసపోవడం తప్పు మళ్లీ తెలిసే మోసపోతే భవిష్యత్ తరాలు గోసపడతాయి
★ నిరుద్యోగులకుCM రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు అయ్యాయా?
★ గ్రాడ్యుయేట్ సోదరులు రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

★ భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:అబద్ధపు,మోసపూరిత హామీలతో CM రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగిందని బీ ఆర్ ఏస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో సోమవారం నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విజయం కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మాజీ సీఎం KCR దిశా నిర్దేశంతో పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం అద్భుత పురోగతి సాధించిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల,2లక్షల ఉద్యోగాలు, 11వేల పైచిలుకు కాంట్రాక్ట్ బేసి ఉద్యోగాలను పర్మినెంట్ చేసిన ఘనత KCR కే దక్కిందన్నారు. మెగా DSC, నిరుద్యోగ భృతి, కాంగ్రెస్ జాబ్ ఇవ్వాలి అండి ఎక్కడ అని ప్రశ్నించారు.ప్రజలు మార్పు కోరుకున్నారు.. గోసపడుతున్నారు.ఒక్కసారి మోసపోవడం తప్పు కాదు.. మళ్లీ తెలిసే మోసపోతే మన తప్పిదం అవుతుందని అన్నారు. అప్పుడు వ్యక్తికి ఓటు వేస్తే భవిష్యత్ తరాలు గోసపడతాయి అని అన్నారు. మాయ మాటల తీన్మార్ మల్లన్న కి ఓటు వేస్తే వ్యర్థం అన్నారు.విద్యావంతుడు, ప్రజల గొంతుక,సౌమ్యుడు BRS అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి పట్టాభద్రులు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాజ్యసభ MP వద్ధి రాజు రవిచంద్ర,ఆ.డా. RS ప్రవీణ్ కుమార్, BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ,మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి,మాజీ గ్రంథాలయం చైర్మన్ దిండిగాల రాజేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRSఅధికార ప్రతినిధులు కోలేటి భవాని శంకర్, లకావత్ గిరిబాబు,వనామా రాఘవ ,బీ ఆర్ ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !