+91 95819 05907

నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన వ్యక్తి అరెస్ట్:DSP

★నిరుద్యోగ యువత దళారులను నమ్మి మోసపోవద్దు : సిరిసిల్ల ఇంచార్జ్ డిఎస్పీ నాగేంద్రాచారి.

నేటి గద్ధర్ వెబ్ డెస్క్:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కు చెందిన ఓ వ్యక్తి
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్లు సిరిసిల్ల ఇంచార్జ్ డిఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ
ఇల్లంతకుంట మండలంలోని నర్సక్కపేట గ్రామానికి చెందిన ర్యాగటి మల్లయ్య అనే వ్యక్తి 2018 సంవత్సరంలో నర్సక్కపేట గ్రామానికి చెందిన కొత్త లింగ రెడ్డి తండ్రి శంకరయ్య, బొల్లా రాము తండ్రి దేవరెడ్డి, తిప్పారవేని చంద్రశేఖర్ తండ్రి రాజయ్య , దారం శ్రీనివాస్ రెడ్డి తండ్రి ప్రతాపరెడ్డి అనే వ్యక్తులను హుస్నాబాద్ చెందిన ( ప్రస్తుతం సిరిసిల్ల పట్టణం) కారునాథం శివకృష్ణ అనే వ్యక్తి పరిచయ చేయగా , కారునాథం శివకృష్ణ అనే వ్యక్తి డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాడు అని వారికి నమ్మబలికి వారి వద్ద నుండి 2023 సంవత్సరంలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, సింగరేణి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసి వారి వద్ద నుండి ఆరు లక్షల యాభై వేల (6,50,000/-) రూపాయలు తీసుకొని తప్పించుకొని తిరుగుతుండగా శివకృష్ణను సోమవారం రోజున ఉదయం 11:00 గంటలకు ఇల్లంతకుంట బస్టాండ్ వద్ద అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను తప్పుదోవ పట్టించి, వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదును వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. యువత కష్టపడి చదువుకొని ప్రభుత్వ నోటిఫికేషన్ల నియమావళి ప్రకారం అర్హతలు సాధించి ఉద్యోగాలు సాధించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ,అలాంటి వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుపుతున్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !