+91 95819 05907

తీవ్రం కానున్న త్రాగునీటి కష్టాలు? సమ్మె బాటలో మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికులు

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు సిద్ధం…

తాగునీటి సరఫరా ఆగితే ప్రజలకు కష్టాలేనా..?

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలి…

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 22:

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మిషన్ భగీరథ రథం గుట్ట దగ్గర పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్ ఉండడంతో కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం వేతనాలు లేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ గత పది సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని వారికి సకాలంలో వేతనాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన మండిపడ్డారు. వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరాను ఆపేస్తూ సమ్మె నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో కార్మికులందరిని ఐక్యత పర్చి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సిఐటియు నాయకులు పాయం నాగరాజు,సతీష్,ప్రభాకర్,
విష్ణు,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

 Don't Miss this News !