+91 95819 05907

తీవ్రం కానున్న త్రాగునీటి కష్టాలు? సమ్మె బాటలో మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికులు

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు సిద్ధం…

తాగునీటి సరఫరా ఆగితే ప్రజలకు కష్టాలేనా..?

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలి…

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 22:

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మిషన్ భగీరథ రథం గుట్ట దగ్గర పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్ ఉండడంతో కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం వేతనాలు లేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ గత పది సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని వారికి సకాలంలో వేతనాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన మండిపడ్డారు. వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరాను ఆపేస్తూ సమ్మె నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో కార్మికులందరిని ఐక్యత పర్చి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సిఐటియు నాయకులు పాయం నాగరాజు,సతీష్,ప్రభాకర్,
విష్ణు,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !