+91 95819 05907

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు ఎప్పుడు విడుదల చేస్తారు?IFTU

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి.

ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

నేటి గద్ధర్ న్యూస్, పినపాక:

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పినపాక మండలం లోని వివిధ గ్రామపంచాయతీలను సందర్శించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామపంచాయతీలలో 2 నుండి 5 నెలల వరకు జీతాలు పెండింగ్ ఉన్నాయని దీనివలన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు చెత్తా,చెదారం మధ్య దుర్గంధ వాసనల మధ్య తమ ఆరోగ్యాలను, ప్రాణాలను పణంగా పెట్టి చాలీ,చాలని వేతనాలతో పనిచేస్తూ, పల్లెలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను కాపాడుతున్నప్పటికీ గ్రామపంచాయతీ కార్మికుల పట్ల సంబంధిత అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అసలే చాలీ,చాలని వేతనాలతో పని చేస్తున్న వారికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి జీతాలు మొత్తం చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల ఆదాయాలలో గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించటానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మేము అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీ అమలు కోసం ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల చెల్లింపు పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !