+91 95819 05907

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు ఎప్పుడు విడుదల చేస్తారు?IFTU

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి.

ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

నేటి గద్ధర్ న్యూస్, పినపాక:

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పినపాక మండలం లోని వివిధ గ్రామపంచాయతీలను సందర్శించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామపంచాయతీలలో 2 నుండి 5 నెలల వరకు జీతాలు పెండింగ్ ఉన్నాయని దీనివలన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు చెత్తా,చెదారం మధ్య దుర్గంధ వాసనల మధ్య తమ ఆరోగ్యాలను, ప్రాణాలను పణంగా పెట్టి చాలీ,చాలని వేతనాలతో పనిచేస్తూ, పల్లెలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను కాపాడుతున్నప్పటికీ గ్రామపంచాయతీ కార్మికుల పట్ల సంబంధిత అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అసలే చాలీ,చాలని వేతనాలతో పని చేస్తున్న వారికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి జీతాలు మొత్తం చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల ఆదాయాలలో గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించటానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మేము అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీ అమలు కోసం ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల చెల్లింపు పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

 Don't Miss this News !