+91 95819 05907

ఉపాధి హామీలో అంతులేని అవినీతి… అధికారులు ఏం చేస్తున్నట్లు

ఉపాధి హామీలో రెక్కల కష్టం మాయం..?

శ్రమ ఒకడిది … సోక్కొక్కడిదా…

ఉపాధి హామీ వేతనాలను రికవరీ చేయాలని ఎంపీడీవోకి వినతి

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (చర్ల మే 28):

చర్ల మండల పరిధిలోని గొంపల్లి గ్రామ ప్రజలు గత మూడు నెలల పాటు ఉపాధి హామీ పనులు చేస్తే వారి అకౌంట్లో డబ్బులు పడకుండా ఉపాధి హామీ పనులు చేయనటువంటి వారి వ్యక్తుల ఖాతాల్లో సొమ్మును ఎలా జమ చేస్తారని,ఉపాధి హామీ వేతనాల చెల్లింపులో అవకతవకలు జరిపిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ సొమ్మును మాకు రికవరి చేసి ఇప్పించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ చర్ల పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి పని కార్మికులు చర్ల ఎంపీడీవో కనపర్తి ఈదయ్య కి మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ,ఉపాధి హామీ పని వేతనం చెల్లింపులో అవకతవకలు జరిపిన సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు చెప్పట్టాలని కార్మికుల కష్టాన్ని కార్మికులు నోచుకోకుండా సుమారుగా మూడు లక్షల రూపాయల సొమ్మును పక్కదారి పట్టించి కార్మికుల పొట్ట మీద కొట్టిన దుర్మార్గులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.నష్టపోయిన కార్మికులకు న్యాయం చేయాలని వారు కష్టపడ్డ సొమ్మును వారికి రికవరీ చేసి ఇప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను మోసం చేసి వారి కష్టాన్ని అదునుగా చేసుకొని వారికి రావలసిన సొమ్మును వారికి రాకుండా కాజేసిన దుర్మార్గులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల వేతనాలను తక్షణమే రికవరీ చేయాలని అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం ఎంపీడీవో ఈదయ్య మాట్లాడుతూ, కార్మికుల కష్టాన్ని తప్పుదోవ పట్టించిన దుర్మార్గులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.ఉపాధి కూలీల సొమ్ముని రికవరీ చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ మండల నాయకులు చెన్నం మోహన్ ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !