+91 95819 05907

ఉపాధి హామీలో అంతులేని అవినీతి… అధికారులు ఏం చేస్తున్నట్లు

ఉపాధి హామీలో రెక్కల కష్టం మాయం..?

శ్రమ ఒకడిది … సోక్కొక్కడిదా…

ఉపాధి హామీ వేతనాలను రికవరీ చేయాలని ఎంపీడీవోకి వినతి

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (చర్ల మే 28):

చర్ల మండల పరిధిలోని గొంపల్లి గ్రామ ప్రజలు గత మూడు నెలల పాటు ఉపాధి హామీ పనులు చేస్తే వారి అకౌంట్లో డబ్బులు పడకుండా ఉపాధి హామీ పనులు చేయనటువంటి వారి వ్యక్తుల ఖాతాల్లో సొమ్మును ఎలా జమ చేస్తారని,ఉపాధి హామీ వేతనాల చెల్లింపులో అవకతవకలు జరిపిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ సొమ్మును మాకు రికవరి చేసి ఇప్పించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ చర్ల పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి పని కార్మికులు చర్ల ఎంపీడీవో కనపర్తి ఈదయ్య కి మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ,ఉపాధి హామీ పని వేతనం చెల్లింపులో అవకతవకలు జరిపిన సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు చెప్పట్టాలని కార్మికుల కష్టాన్ని కార్మికులు నోచుకోకుండా సుమారుగా మూడు లక్షల రూపాయల సొమ్మును పక్కదారి పట్టించి కార్మికుల పొట్ట మీద కొట్టిన దుర్మార్గులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.నష్టపోయిన కార్మికులకు న్యాయం చేయాలని వారు కష్టపడ్డ సొమ్మును వారికి రికవరీ చేసి ఇప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను మోసం చేసి వారి కష్టాన్ని అదునుగా చేసుకొని వారికి రావలసిన సొమ్మును వారికి రాకుండా కాజేసిన దుర్మార్గులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల వేతనాలను తక్షణమే రికవరీ చేయాలని అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం ఎంపీడీవో ఈదయ్య మాట్లాడుతూ, కార్మికుల కష్టాన్ని తప్పుదోవ పట్టించిన దుర్మార్గులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.ఉపాధి కూలీల సొమ్ముని రికవరీ చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ మండల నాయకులు చెన్నం మోహన్ ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 6

Read More »

 Don't Miss this News !