+91 95819 05907

అనధికారికంగా రహదారి వెంబడి ఇసుక లారీలు నిలిపితే కేసులు నమోదు చేయండి:జిల్లా SP డా.శబరిష్

★నెలవారీ నేరసమీక్షా సమావేశం నిర్వహణ

★వర్షకాలం వరద ముప్పును ఎదురుకోవడానికి ముందస్తు ఏర్పాట్ల పై చర్చ

★కల్తీ విత్తనాలను అరికట్టాలి – ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు

★పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలి

★నేర పరిశోధనలలో సీసీటీవీ ల పాత్ర కీలకం – అన్ని ప్రధాన కూడల్ల వద్ద అమర్చండి.

★ భాధిత వ్యక్తులకు న్యాయం జరగాలి

★ రహదారుల వెంబడి ఇసుక లారీ లు అనధికార పార్కింగ్ చేస్తే కేసులు నమోదు చేయండి

★పంట పొలాలు అడవులలో విద్యుత్ తీగలు అమర్చేవారిని బైండ్ ఓవర్ చేయండి

నేటి గదర్ న్యూస్, , ములుగు ప్రతినిధి(మే 28):

ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్ పి డా. శబరిష్ ఐపిఎస్ జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమావేశం ను మంగళవారం నిర్వహించారు.

పోలీస్ స్టేషన్ల వారీగా ఆయా పోలీస్ స్టేషన్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్పీ పరిశీలించి దానికి గల కారణాలను కులంకుషంగా చర్చించి మార్గదర్శకాలను జారీ చేశారు.

రానున్న వర్షాకాలంలో ములుగు జిల్లాకు వరద ముప్పు పొంచి ఉన్నందున గత అనుభవాల దృష్ట్యా ప్రజల క్షేమం కోసం పోలీస్ శాఖ తరపున తీసుకోవాల్సిన చర్యలపై చర్చిండం జరిగింది.

నకిలీ విత్తనాలా ద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టడానికి పోలీస్ శాఖ తరపున ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ను ఏర్పాటుచేసి నిరంతరం గమనించడం జరుగుతున్నదని బ్రాండెడ్ విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్ పి అదేశించారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా సీసీ కెమెరాల అమరికా పై చర్చించారు. ప్రజలు గ్రామ పెద్దల సహకారంతో ఆయా మండలాల అన్ని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని నేర పరిశోధన నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకం అని తెలియజేశారు.అనంతరం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామాల పంట పొలాలలో అడవులలో అక్రమంగా విద్యుత్ తీగలు అమరుస్తున్న వ్యక్తుల పై కఠినంగా వ్యవహరించాలని అనుమానితులను వెంటనే బైండ్ ఓవర్ చేయవలసిందిగా అదేశించారు.

అనధికారికంగా రహదారి వెంబడి ఇసుక లారీలు నిలిపితే కేసులు నమోదు చేయండి అవసరం అనుకుంటే సీజ్ చేయాలనీ ఎస్పీ ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని వారి కష్టాన్ని తీర్చగలమనే భరోసాని వారికి కల్పించాలని బాధితులకు న్యాయం చేయకపోతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉండే అర్హత లేదని ఎస్ పి అన్నారు.

ఈ సమావేశంలో ఏఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్ , ములుగుడీఎస్పీ రవీందర్ డి.ఎస్.పి డిసిఆర్బి రాములు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ములుగు సిఐరంజిత్ కుమార్ , ఎటుర్ నాగారం సిఐ రాజు , వెంకటాపురం సి ఐ కుమార్ ములుగు ఎస్సైవెంకటేశ్వర్లు, వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు పస్రా ఎస్సై కమలాకర్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఎటుర్ నాగారం ఎస్సై కృష్ణ ప్రసాద్ , వాజేడు వెంకటేశ్వర్లు కన్నాయిగూడెం ఎస్సైసురేష్ , పేరూరు ఎస్సైరమేష్ మంగపేటఎస్సై రవికుమార్ వెంకటాపురం ఎస్సై అశోక్ పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !