+91 95819 05907

అనధికారికంగా రహదారి వెంబడి ఇసుక లారీలు నిలిపితే కేసులు నమోదు చేయండి:జిల్లా SP డా.శబరిష్

★నెలవారీ నేరసమీక్షా సమావేశం నిర్వహణ

★వర్షకాలం వరద ముప్పును ఎదురుకోవడానికి ముందస్తు ఏర్పాట్ల పై చర్చ

★కల్తీ విత్తనాలను అరికట్టాలి – ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు

★పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలి

★నేర పరిశోధనలలో సీసీటీవీ ల పాత్ర కీలకం – అన్ని ప్రధాన కూడల్ల వద్ద అమర్చండి.

★ భాధిత వ్యక్తులకు న్యాయం జరగాలి

★ రహదారుల వెంబడి ఇసుక లారీ లు అనధికార పార్కింగ్ చేస్తే కేసులు నమోదు చేయండి

★పంట పొలాలు అడవులలో విద్యుత్ తీగలు అమర్చేవారిని బైండ్ ఓవర్ చేయండి

నేటి గదర్ న్యూస్, , ములుగు ప్రతినిధి(మే 28):

ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్ పి డా. శబరిష్ ఐపిఎస్ జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమావేశం ను మంగళవారం నిర్వహించారు.

పోలీస్ స్టేషన్ల వారీగా ఆయా పోలీస్ స్టేషన్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్పీ పరిశీలించి దానికి గల కారణాలను కులంకుషంగా చర్చించి మార్గదర్శకాలను జారీ చేశారు.

రానున్న వర్షాకాలంలో ములుగు జిల్లాకు వరద ముప్పు పొంచి ఉన్నందున గత అనుభవాల దృష్ట్యా ప్రజల క్షేమం కోసం పోలీస్ శాఖ తరపున తీసుకోవాల్సిన చర్యలపై చర్చిండం జరిగింది.

నకిలీ విత్తనాలా ద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టడానికి పోలీస్ శాఖ తరపున ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ను ఏర్పాటుచేసి నిరంతరం గమనించడం జరుగుతున్నదని బ్రాండెడ్ విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్ పి అదేశించారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా సీసీ కెమెరాల అమరికా పై చర్చించారు. ప్రజలు గ్రామ పెద్దల సహకారంతో ఆయా మండలాల అన్ని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని నేర పరిశోధన నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకం అని తెలియజేశారు.అనంతరం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామాల పంట పొలాలలో అడవులలో అక్రమంగా విద్యుత్ తీగలు అమరుస్తున్న వ్యక్తుల పై కఠినంగా వ్యవహరించాలని అనుమానితులను వెంటనే బైండ్ ఓవర్ చేయవలసిందిగా అదేశించారు.

అనధికారికంగా రహదారి వెంబడి ఇసుక లారీలు నిలిపితే కేసులు నమోదు చేయండి అవసరం అనుకుంటే సీజ్ చేయాలనీ ఎస్పీ ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని వారి కష్టాన్ని తీర్చగలమనే భరోసాని వారికి కల్పించాలని బాధితులకు న్యాయం చేయకపోతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉండే అర్హత లేదని ఎస్ పి అన్నారు.

ఈ సమావేశంలో ఏఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్ , ములుగుడీఎస్పీ రవీందర్ డి.ఎస్.పి డిసిఆర్బి రాములు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ములుగు సిఐరంజిత్ కుమార్ , ఎటుర్ నాగారం సిఐ రాజు , వెంకటాపురం సి ఐ కుమార్ ములుగు ఎస్సైవెంకటేశ్వర్లు, వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు పస్రా ఎస్సై కమలాకర్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఎటుర్ నాగారం ఎస్సై కృష్ణ ప్రసాద్ , వాజేడు వెంకటేశ్వర్లు కన్నాయిగూడెం ఎస్సైసురేష్ , పేరూరు ఎస్సైరమేష్ మంగపేటఎస్సై రవికుమార్ వెంకటాపురం ఎస్సై అశోక్ పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

 Don't Miss this News !