+91 95819 05907

బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్

నేటి గదర్ న్యూస్, మే 28 :

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నా లజీస్ (బాసర ట్రిపుల్ ఐటీ)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆదేండ్ల ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూన్ 1నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నదని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వెంకటర మణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.పీహెచ్, సీఏపీ. ఎస్సీసీ, స్పో ర్బ్ తదితర స్పెషల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు ప్రింట్స్ ను పోస్టుద్వారావంపేందుకు జూన్ 29 వరకు గడువు ఉందని చెప్పారు. జులై 3న ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టును రిలీజ్ చేస్తామని వెల్లడించారు. సెలెక్ట్ అయిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 8,9,10వ తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా 1500 సీట్లను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.450, గ్లోబల్ సీట్లకు ఇతర రాష్ట్రా లకు చెందిన విద్యార్థులకు రూ. 1500 ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ఆరఐ. ఇంటర్నేషనల్ కోటాలో దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు వంద డాలర్ల ఫీజు ఉంటుందని స్పష్టం చేశారు. టెన్త్ జీపీఏ ఆధారంగానే సీట్లు పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగానే విద్యార్థు లకు సీట్లను అలాట్ చేయనున్నామని వెంకటరమణ చెప్పారు. ఆర్టికల్ 371 డి ప్రకారం ఈ విద్యాసంవత్స రం కూడా 85% సీట్లు లోకల్ కింద తెలంగాణకు కేటాయించామని, మిగిలిన 15% సీట్లకు ఓపెన్ కేటగిరీలో తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీ పడొచ్చని తెలిపారు. నాన్ రెసిడెన్షియల్ సర్కారు విద్యాసంస్థల్లో చదివిన స్టూడెంట్లకు జీపీఏతో పాటు అదనంగా 0.4 స్కోర్ను యాడ్ చేస్తామని వెల్లడించారు. ఒకే రకమైన గ్రేడ్ వస్తే.. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లోని గ్రేమ్లను ప్రామాణికంగా తీసుకొని సీట్లను అలాట్ చేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు admissions@ rgukt.ac.in. https://www.rgukt.ac.in అధి కారిక వెబ్ సైట్ ను సంపదించాలని వీసీ వెంకటరమణ సూచించారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !