+91 95819 05907

బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్

నేటి గదర్ న్యూస్, మే 28 :

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నా లజీస్ (బాసర ట్రిపుల్ ఐటీ)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆదేండ్ల ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూన్ 1నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నదని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వెంకటర మణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.పీహెచ్, సీఏపీ. ఎస్సీసీ, స్పో ర్బ్ తదితర స్పెషల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు ప్రింట్స్ ను పోస్టుద్వారావంపేందుకు జూన్ 29 వరకు గడువు ఉందని చెప్పారు. జులై 3న ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టును రిలీజ్ చేస్తామని వెల్లడించారు. సెలెక్ట్ అయిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 8,9,10వ తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా 1500 సీట్లను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.450, గ్లోబల్ సీట్లకు ఇతర రాష్ట్రా లకు చెందిన విద్యార్థులకు రూ. 1500 ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ఆరఐ. ఇంటర్నేషనల్ కోటాలో దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు వంద డాలర్ల ఫీజు ఉంటుందని స్పష్టం చేశారు. టెన్త్ జీపీఏ ఆధారంగానే సీట్లు పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగానే విద్యార్థు లకు సీట్లను అలాట్ చేయనున్నామని వెంకటరమణ చెప్పారు. ఆర్టికల్ 371 డి ప్రకారం ఈ విద్యాసంవత్స రం కూడా 85% సీట్లు లోకల్ కింద తెలంగాణకు కేటాయించామని, మిగిలిన 15% సీట్లకు ఓపెన్ కేటగిరీలో తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీ పడొచ్చని తెలిపారు. నాన్ రెసిడెన్షియల్ సర్కారు విద్యాసంస్థల్లో చదివిన స్టూడెంట్లకు జీపీఏతో పాటు అదనంగా 0.4 స్కోర్ను యాడ్ చేస్తామని వెల్లడించారు. ఒకే రకమైన గ్రేడ్ వస్తే.. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లోని గ్రేమ్లను ప్రామాణికంగా తీసుకొని సీట్లను అలాట్ చేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు admissions@ rgukt.ac.in. https://www.rgukt.ac.in అధి కారిక వెబ్ సైట్ ను సంపదించాలని వీసీ వెంకటరమణ సూచించారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

 Don't Miss this News !