+91 95819 05907

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, పోలీసుల సంయుక్త దాడి

★700 లీటర్ల బెల్లం పానకం,5 లీటర్ల నాటు సారా స్వాధీనం

★ సారకాస్తున్న మహిళ ,

◆ బెల్లం, పట్టిక సమకూర్చిన మహిళపై కూడా కేసు నమో
★ సారాయి తయారీకి వినియోగించే బెల్లం, పట్టిక నమ్మిన బైండోవర్ కేసులు నమోదు చేస్తాం

నేటి గద్ధర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి(పినపాక): పినపాక మండలం దుగునపల్లి గ్రామంలో మంగళవారం గుడుంబా స్థావరాల పై ఏడూళ్ల బయ్యారం పోలీసులు, మణుగూరు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు . సంఘటనా స్థలంలో నాటు సారా కాస్తున్న మాలోత్ బుజ్జి అనే మహిళ నుండి 5 లీటర్ల నాటు సారాను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను విచారించగా పోలిశెట్టి నాగమణి అనే మహిళ నుండి బెల్లం పట్టిక, సారాయి తయారీకి వినియోగించే వెళ్ళు కొనుగోలు చేసినట్లు తెలపడంతో … నాగమణి మీద సైతం కేసు నమోదు చేశారు. అక్రమంగా నాటు సారాయికి వినియోగించే బెల్లం , పట్టికను ఎవరు విక్రయించిన బైండవర్ కేసులు నమోదు చేస్తామని ఆయా శాఖల అధికారులు సీరియస్ గా హెచ్చరించారు. అనంతరం దుగినేపల్లిగ్రామంలో ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో నాటుసార త్రాగడం మూలంగా కలిగి అనారోగ్య సమస్యలను వివరించారు. నాటు సారా కాస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా శాఖల అధికారులు గుడుంబా తయారీదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం పోలీసులు, మణుగూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

 Don't Miss this News !