+91 95819 05907

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

◆సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి.

◆చెరువులు, కుంటలు, ప్రాజెక్ట్ ల నీటి నిల్వల సామర్థ్యం పై నివేదికలు సమర్పించాలి.

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 3):

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

సోమవారం కలేక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలు రెవిన్యూ శాఖ కు సంబంధించినవి (02), ఉద్యోగాలకు సంబంధించినవి (03), పెండింగ్ బిల్లులకు సంబంధించినవి (04), ఇతర శాఖలకు సంబంధించినవి (4), మొత్తం (13) దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ,ఆర్డీవో సత్యపాల్ రెడ్డి లతో కలిసి దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలోని చెరువ్వులు, కుంటలు, ప్రాజెక్ట్ ల మరమత్తులు నివేదికలు వాటి ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం , పూర్తి నీటి నిల్వ సామర్థ్యం తదితర వివరాలు వెంటనే నివేదిక సమర్పించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు పంపిణీ చేసే బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు వచ్చే మూడు నెలలకు సరిపోయే విధంగా డీలర్లు స్టాక్ నిల్వలు సిద్ధంగా ఉంచుకోనే విధంగా చూడాలని సంబంధిత అధికారులును ఆదేశించారు. వర్షాకాలం లో సీజనల్ వ్యాధుల పై వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు అందుబాటులో ఉండాలని , మందుల కొరత లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డిఓ శ్రీనివాస్ కుమార్, డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, డి ఎం సివిల్ సప్లయి రాంపతి, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, డి ఈ ఓ పాణిని, డి సి ఓ సర్దార్ సింగ్ ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

 Don't Miss this News !