+91 95819 05907

దేశ రాజకీయాల్లో లెజెండ్ గా మారనున్న చంద్రబాబు నాయుడు.

బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేదు…

మా మద్దతు ఈసారి ఎన్డీఏకే: చంద్రబాబు నాయుడు.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అమరావతి,జూన్ 05:
నైనారపు నాగేశ్వరరావు ✍️
789 353 8668

సార్వత్రిక సమరంలో బీజేపీ గెలిచినప్పటికీ,మెజారిటీ గతం కంటే తగ్గింది. పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేకుండా పోయింది.ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమిలోని పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సి వస్తోంది.ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్డీయే కూటమిలో గతంలో మాదిరే బాబు కీలకంగా మారే అవకాశం ఉంది.దేశంలో అటు ఎన్డీయే ఇటు ఇండియా బ్లాక్‌గా రాజకీయ పార్టీలు అన్ని విడిపోయాయి. రెండు భారీ క్యాంపుల మధ్య హోరా హోరీ పోరు సాగింది.ఎన్డీయేలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.బీజేపీ తర్వాత తెలుగుదేశం మినహా మరే పార్టీకి అన్ని సీట్లలో విజయం సాధించలేదు.ఏపీలో ఎన్డీయే 21 స్థానాల్లో గెలుపొందగా,తెలుగు దేశం పార్టీ సింగిల్‌గా 16 సీట్లు సాధించుకుంది.ఈ బిగ్ నంబర్‌తో ఎన్డీయే లో మోడీ తర్వాత చంద్రబాబు కీలకం అయ్యారు.బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సరిపడా అన్ని అవకాశాలు చంద్రబాబుకు ఉన్నాయి.ఎన్డీయే కూటమికి టైట్ మార్జిన్ రావడంతో బాబు పాత్ర అత్యంత కీలకంగా మారింది.ఇండియా కూటమిలోని మిత్రులను ఈ వైపునకు తీసుకుని వచ్చినా ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదు.తద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకురాగల సమర్థుడే చంద్రబాబు నాయుడు అంటూ మేధావి వర్గంలో చర్చలు జరుగుతున్నాయి.

మా మద్దతు ఈసారి ఎన్డీఏకే: చంద్రబాబు నాయుడు.

కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ,రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది.ఎన్నో రాజకీయ మార్పులను చూశాను.ఇప్పుడు ఎన్డీఏతోనే మా ప్రయాణం అంటున్న చంద్రబాబు నాయుడు.ఇవాళ కూటమి మీటింగ్‌కు ఢిల్లీ వెళ్తున్నట్లుగా విశ్వాసనీయ సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

Surya peta: వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు.

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు. వరంగల్ లో జరుగనున్న BRS రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు.. BRS రజతోత్సవ సభకు మేముసైతం

Read More »

పినపాకలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు .

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా జరిగాయి. పినపాక మండల తెలుగు దేశం పార్టీ

Read More »

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు. మహదేవపురం ఎత్తిపోతల పథకం – సాగునీటి సరఫరాలో చరిత్రాత్మక ముందడుగు ఖమ్మం జిల్లా,మధిర మండలం,

Read More »

మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

. బునియది ఆదివాసి, కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

Read More »

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం

Read More »

 Don't Miss this News !