+91 95819 05907

దేశ రాజకీయాల్లో లెజెండ్ గా మారనున్న చంద్రబాబు నాయుడు.

బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేదు…

మా మద్దతు ఈసారి ఎన్డీఏకే: చంద్రబాబు నాయుడు.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అమరావతి,జూన్ 05:
నైనారపు నాగేశ్వరరావు ✍️
789 353 8668

సార్వత్రిక సమరంలో బీజేపీ గెలిచినప్పటికీ,మెజారిటీ గతం కంటే తగ్గింది. పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేకుండా పోయింది.ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమిలోని పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సి వస్తోంది.ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్డీయే కూటమిలో గతంలో మాదిరే బాబు కీలకంగా మారే అవకాశం ఉంది.దేశంలో అటు ఎన్డీయే ఇటు ఇండియా బ్లాక్‌గా రాజకీయ పార్టీలు అన్ని విడిపోయాయి. రెండు భారీ క్యాంపుల మధ్య హోరా హోరీ పోరు సాగింది.ఎన్డీయేలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.బీజేపీ తర్వాత తెలుగుదేశం మినహా మరే పార్టీకి అన్ని సీట్లలో విజయం సాధించలేదు.ఏపీలో ఎన్డీయే 21 స్థానాల్లో గెలుపొందగా,తెలుగు దేశం పార్టీ సింగిల్‌గా 16 సీట్లు సాధించుకుంది.ఈ బిగ్ నంబర్‌తో ఎన్డీయే లో మోడీ తర్వాత చంద్రబాబు కీలకం అయ్యారు.బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సరిపడా అన్ని అవకాశాలు చంద్రబాబుకు ఉన్నాయి.ఎన్డీయే కూటమికి టైట్ మార్జిన్ రావడంతో బాబు పాత్ర అత్యంత కీలకంగా మారింది.ఇండియా కూటమిలోని మిత్రులను ఈ వైపునకు తీసుకుని వచ్చినా ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదు.తద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకురాగల సమర్థుడే చంద్రబాబు నాయుడు అంటూ మేధావి వర్గంలో చర్చలు జరుగుతున్నాయి.

మా మద్దతు ఈసారి ఎన్డీఏకే: చంద్రబాబు నాయుడు.

కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ,రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది.ఎన్నో రాజకీయ మార్పులను చూశాను.ఇప్పుడు ఎన్డీఏతోనే మా ప్రయాణం అంటున్న చంద్రబాబు నాయుడు.ఇవాళ కూటమి మీటింగ్‌కు ఢిల్లీ వెళ్తున్నట్లుగా విశ్వాసనీయ సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !